కాగితాల పువ్వు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఇది అన్ని చోట్లా పెరుగుతుంది. దీనిని హెడ్డి, పొద, ప్రాకే తీగగా కుండీల్లో పెంచవచ్చు. ఇది పదునైన మందమైన ముళ్ళు కలిగి ఉంటుంది. కనుక పశువులు, మేకలు, కోతులు, పక్షులు హని కలిగించవు. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. వేడి, పొడి వాతావరణంలో కొన్ని రకాలు కాంతివంతంగా, ఆకర్షణీయమైన రంగులలో పెరుగుతాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈపూవుకి గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది.

సాధారణ నామం : బోగన్ విల్లియా శాస్త్రీయ నామం : బోగన్ విల్లియా గ్లాబ్రా/ బోగన్విల్లియా సైక్టాబాలిస్ కుటుంబం: నిక్టాజినేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- ఈ మొక్క ఆకులు పినిటోల్ అనే రాసాయనం కలిగియుండి మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ చికిత్సలకు ఆకులను ఉపయోగిస్తారు.
- కాగితాల పూలతో తయారు చేసిన టీని, శ్వాసకోశవ్యాధుల నివారణకు త్రాగిస్తారు.
- ఈ మొక్క పూలు, కాండాలను ఎండబెట్టి నీటిలో మరిగించి టీ లాగా త్రాగుతారు.
- ఆకులను డయేరియా, చికిత్సలలో ఉపయోగిస్తారు. దగ్గు, గొంతునొప్పి, ఎసిడిటి నివారణకు ఉపయోగిస్తారు.
- పూల ద్రావణాన్ని తక్కువ రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కొమ్మలు హెపటైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
- కాగితాల పువ్వు మొక్క ఆకుల పొడి (10 గ్రా. గాఢత) చిక్కుడు గింజలు నిల్వ సమయంలో ఆశించే బీన్వీలిల్, అకాంతో సెలిడెస్ ఓబ్టెక్టస్ని అత్యధికంగా చంపింది. (విల్సన్, అతని అనుచరుడు, 2016) ఆకులలో ఫినాల్ అధిక పరిమానంలో వున్నాయి కనుక కీటక నాశక చర్య ప్రదర్శించాయి. (లీ, అతని అనుచరులు, 1997)
- కాగితాల పువ్వు మొక్క ఆకుల డ్రావణం టమాట, చిక్కుడు పంటల నాశించే అనేక వైరస్ తెగుళ్ళను నివారిస్తుంది.
- ఆకుద్రావణం తయారీ: ఒక లీటరు నీటిలో 200 గ్రా. తాజా ఆకులను కలిపి కనీసం 5 నిమిషాలు మిక్సీలో కలపాలి.
- కాగితాల పువ్వు మొక్క ఆకులు మిథనాల్ ద్రావణం వరి పంటనాశించే లద్దె పురుగు స్పోడోప్టెరా మరిషియా 3 నుండి 6వ దశ లార్వాలు, పూలపై లార్వా సైడల్పై మరియు ప్యూపెసైడల్ చర్య ప్రదర్శించాయి. ఆకుల ద్రావణం { కీటక పెరుగుదల క్రమబద్దీకరం, ఫ్యూఫెనోక్సురాన్ పిచికారి స్పొడోప్టెరా మరిషియా నివారణకు అత్యత్తమ ఎంపిక అని ఫలితాలు వెల్లడించాయి. (ప్రసీజ, అతని అనుచరులు, 2015)
- బోగన్ విల్లియా ఆకు ద్రావణం ఈడెస్ ఈజిప్టు లార్వా, ప్యూపాలను చంపింది. (రాజమోహన్ Ê లోగన్ కుమార్, 2012)
- బోగన్విల్లియా స్పెక్లిబాలిస్ ఆకు ద్రావణం అలసంద, పొద్దుతిరుగుడు పంటల నాశించే సన్ఫ్లవర్ నైక్రోసిస్ వైరస్లను తగ్గించింది (సోమేశ్వర్ భాగత్, అతని అనుచరులు, 2016)
బోగన్ విల్లియా ఆకుల కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు – 1 కి., బోగన్ విల్లియా, ఆకులు 1 కి., బొప్పాయి ఆకులు – 1 కి. పసుపు పొడి – 200 గ్రా.
తయారు చేసే విధానం
- పైన సూచించిన ఆకులను పసుపు పొడిని పైన పేర్కొన్న మోతాదులో తీసుకుని ఆకులను బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడక బెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి నిల్వ వుంచకుండా వేంటనే ఒక ఎకరంలో పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
- పంటకాలంలో పంట దశ,తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.
నివారించబడే పురుగులు
- బోగన్ విల్లియా ఆకులలో వున్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశణిగా, వికర్షినిగా పనిచేస్తాయి.
- బోగన్విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్ నివారిస్తాయి.
- బోగన్ విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తాయి.
నివారించబడే తెగుళ్ళు
- బోగన్ విల్లియా ఆకుల కషాయం పసుపు పెసర వంటి పంటల నాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

