చిటుకు వేసేంతలోనే గొర్రెలు చనిపోతాయి. కావున ఈ వ్యాధిని చిటుకు రోగం, నెత్తి పిడుగు వ్యాధి లేదా గడ్డి రోగం అని పిలుస్తారు.

వ్యాధి ఎలా వస్తుంది?

క్లోస్ట్రిడియం సెర్ఫ్రింజన్స్‌ టైపు ఈ బాక్టీరియా తొలకరి వర్షాలు తరువాత పెరిగిన గడ్డిలో టాక్సిన్‌ విడుదల చేస్తుంది, ఆ టాక్సిన్‌ తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువగా జూన్‌ నుండి జూలై మాసాలలో వస్తుంది. కొదుమలలో (సంవత్సరం వయస్సుగల గొర్రెలు), వలస వెళ్ళు గొర్రెల్లో ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు

  • ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడకుండానే, గొర్రెలు చనిపోతాయి.
  • చనిపోయే ముందుగా గొర్రెలు నీరసంగా ఉంటాయి, గొర్రెలు గిలగిలా కొట్టుకొని, గాలిలోకి ఎగిరి క్రిందపడి వెంటనే చనిపోతాయి.
  • జ్వరం, ఫిట్స్‌ వచ్చి చనిపోవటం జరుగుతుంది.
  • మేకల్లో పారుడు గమనించవచ్చు.
  • ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కనపడుతుంది. 
  • మందలోని సుమారు 5-10% గొర్రెలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వర్షాకాలం కంటే ముందే ఏప్రిల్‌, మే మాసాలలో మందలోని అన్ని గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి ఈ వ్యాధిని నివారించుకోవాలి.
  • మందలోని గొర్రెలలో ఈ వ్యాధిని గమనించిన వెంటనే స్థానిక పశువైద్యుని సలహా తీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలి.
  • తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన లేత గడ్డిని గొర్రెలకు మేపినచో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాడిపోయిన గడ్డిని ఎక్కువగా మేపరాదు. 
  • వ్యాధి సోకిన మందను, ఇతర మందుల నుండి దూరంగా ఉంచి, తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వ్యాప్తి ఆరికట్టవచ్చు.

చికిత్స: వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే, స్థానిక పశువైద్యుని పర్యవేక్షణలో యాంటిబయోటిక్‌ మందులు ఇంజక్షన్ల రూపేణా వాడాలి.

డా.టి.జశ్వంత్‌ రెడ్డి, శాస్త్రవేత్త (పశు వైద్య విభాగం), డా.కె.ఎల్‌.రావు (9989623824), కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య ఎన్‌. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,

డా.యం. వెంకట ప్రసన్న, ఎంవిఎస్‌సి, పశువైద్యురాలు, మైదుకూరు