రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి… మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్‌ కార్డులు లేకపోవడం, ఆధార్‌ కార్డుల్లో తప్పలుండడం, బ్యాంకు, ఆధార్‌ వివరాల్లో తేడాలుండడం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు లేకపోవడం, అసలు – వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి, స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, అవసరమైన చర్యల గురించి రైతులకు వివరించాలని డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీచేశారు.