కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం ‘పరివర్తన్’లో భాగంగా, చిన్న రైతులకు సాయం చేసేందుకు ప్రైవేట్ రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిద్ధం అయ్యింది. వార్షిక ఆదాయం రూ. 60,000 కంటే తక్కువగా ఉన్న 5 లక్షల మంది చిన్న రైతుల ఆదాయం పెరిగే కార్యక్రమాలను 2025వ సంవత్సరంలోగా చేపట్టాలని బ్యాంకు నిర్ణయించింది. నిరర్ధకంగా ఉన్న 2 లక్షల ఎకరాలను వ్యవసాయానికి అనువుగా మార్చడం ఇందులో ప్రధానమైనది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలను చేపడతామని, 25000 మందికి ఉపకార వేతనాలు అందిస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

16 Sep, 2024
