ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

12 Nov, 2024
రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా
agri news, Agriculture, etv telangana, farmers, kcr about telangana farmers, natural farming, telangana, telangana chief minister, telangana farmer, telangana farmer crisis, telangana farmer issues, telangana farmer news, telangana farmers, telangana farmers cash crisis, telangana farmers paddy, telangana farmers sell paddy, telangana government, telangana govt, telangana latest news, telangana news, telangana paddy farmers, telangana politics, telangana rice farmers news, telangana updates, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ధాన్యం కొనుగోళ్ల, ధాన్యం కొనుగోళ్లు, రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా
