రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సెక్రటేరియట్‌ నుంచి పాల్గొని రైతులతో ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా పత్తి మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలోని రైతులతో మంత్రిగారు ముచ్చటించి అక్కడి సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 06.03.2024 నాడు 110 రైతు వేదికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున దృశ్య శ్రావణ పరికరములు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా మాట్లాడే ”రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయంతెలిసిందే.
.రైతు నేస్తం కార్యక్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ మరియు అనుబంధ శాఖల కార్యకలాపాలపై రైతు సమాజానికి అవగాహన కల్పించడానికి ప్రతి మంగళవారం, ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు 33 ఎపిసోడ్‌లను నిర్వహించి రైతులకు విజయవంతంగా శిక్షణ ఇవ్వడం జరిగింది
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” పై వ్యవసాయ శాస్త్రవేత్త టి. ప్రభాకర్‌ రెడ్డి, కెవికె, పాలెం నుండి దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అభ్యుదయ రైతులు చంద్రయ్య మరియు దేవేందర్‌ రెడ్డి గార్లు వారి అనుభవాలను పేర్కొంటూ వరి కొయ్యలు కాల్చవద్దని, తద్వారా కలిగే లాభాలను తమ అభిప్రాయాలను తోటి రైతులతో పంచుకొన్నారు.
మంత్రివర్యులు ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌ రైతులతో కూడా పత్తి కొనుగోలు అంశాలపై మట్లాడుతూ, వరి మరియు పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు. పంట సాగుచేసిన రైతుల ఖాతాలలో మాత్రమే నగదు జమ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి జిల్లాలలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాల నుండి ముఖాముఖి మాట్లాడి, వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు సంబందించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరి సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ గురించి, సన్న ధాన్యం పండించి, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో అమ్మి, బోనస్‌ డబ్బులు జమ అయిన రైతులతో మాట్లాడినారు.
ఈ సందర్భముగా రైతులు స్పందిస్తూ, వరి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు బాగున్నాయని, ముఖ్యముగా సన్న ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజులలోనే బోనస్‌ డబ్బులు రూ.500 ప్రతి క్వింటాలుకు జమ అవుతున్నాయని, రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధమైన చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
పిమ్మట మంత్రి గారు మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, కోసిన తర్వాత, వాటి అవశేషాలను రైతులు కాల్చి వేయడం వలన, భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుందని, ఈ విధంగా చేయడం వలన భూమి కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని, పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, భూమిలో కుళ్ళి పోయేటట్లు చేసుకోవాలని, ఈ విషయమై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, మరియు రైతులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్‌ వింగ్‌, వ్యవసాయ విశ్వ విద్యాలయం రాజేంద్రనగర్‌ నుండి హాజరై రైతులకు అవగహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ కుమార్‌ మరియు పౌర సరఫరా అధికారులు పాల్గొన్నారు.

Read More

రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటినెన్స్‌ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Read More

నాబార్డ్‌ తెలంగాణ సీజీఎంగా బి. ఉదయ్‌ భాస్కర్‌

శ్రీ బి ఉదయ్‌ భాస్కర్‌ 01 అక్టోబర్‌ 2024న నాబార్డ్‌, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం యొక్క చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (CGM)గా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌కు డెవలప్మెంట్‌ బ్యాంకింగ్‌లో 31 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ANGRAU)లో వ్యవసాయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశారు.
1993లో కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్‌లో చేరిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ జార్ఖండ్‌, కర్ణాటక, APలోని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన నాబార్డ్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌, రీఫైనాన్స్‌, క్రెడిట్‌ ప్లానింగ్‌, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, MSME సెక్టార్‌, గ్రామీణ సహకార సంస్థల అభివృద్ధి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తదితర రంగాలలో వివిధ రకాలైన పోర్ట్‌ఫోలియోలను వివిధ ఉన్నత స్థానాల్లో నిర్వహించారు.
ఆయన నాబార్డ్‌, వరంగల్‌ (పూర్వం AP) లో జిల్లా అభివృద్ధి అధికారిగా (DDM) కూడా పనిచేశారు. జిల్లాలో వాటర్‌షెడ్‌ మరియు గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) స్థాపన మరియు అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, SHG- బ్యాంక్‌ లింకేజ్‌ ప్రోగ్రామ్‌ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆర్ధిక సమ్మేళనం, మొదలైన అనేక కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

Read More

దసరా రోజున రైతు భరోసా

తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Read More