APCOB మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా|| ఆర్‌. శ్రీనాథ్‌ రెడ్డి

రైతులు పండిరచిన పంటలను నేరుగా అమ్ముకోకుండా వాటిని ప్రొసెసింగ్‌ చేసుకుని వినియోగదారులకు అమ్ముకొన్నట్లయితే అధిక ఆదాయం పొందవచ్చని మే 15న రైతునేస్తం ఫౌండేషన్‌ను సందర్శించిన APCOB మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా|| ఆర్‌. శ్రీనాథ్‌ రెడ్డి అన్నారు. రైతులు ఏక పంటలు కాకుండా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలి. వ్యవసాయంతో పాటు పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం కూడా చేపట్టినట్లయితే రైతుకు అధిక ఆదాయంతో పాటు భూమికి కావలసిన సేంద్రియ పదార్థాన్ని పొందవచ్చు. రసాయనిక ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులను ఉపయోగించినట్లయితే భూమి ఆరోగ్యంతో పాటు ప్రజలకు మంచి ఉత్పత్తులను అందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా సమస్త జీవరాశులను కాపాడుకోగలుగుతాము. రైతులు కూడా తక్కువ పెట్టుబడితో  అధిక ఆదాయాన్ని పొందే మార్గాలను తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. రైతులకు చిన్న చిన్న ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యంత్ర పరికరాలకు ఋణాలను కూడా APCOB ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రైతునేస్తంలో జరుగుతున్న వివిధ రకాల ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యంత్ర పరికరాలను తమ అధికారులకు కూడా చూపించడం జరిగింది.  రైతులకు కావలసిన ఈ యంత్ర పరికరాలకు ఋణాలను వ్యక్తిగతంగా మరియు గ్రూపులకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో APCOB అధికారులు మరియు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సేంద్రియ సాగు విధానానికి సంబంధించిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు మరియు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా తిలకించారు. వీటితో పాటు దేశీయ జాతి గోవులతో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి గోవ్యర్ధాలను ఏ విధంగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే వివిధ ఉత్పత్తులను ఉదాహరణకు గోవ్యర్ధాలతో పిడకలు, ప్రమిదలు లాంటి  ఉప  ఉత్పత్తులు, కట్టెగానుగతో నూనె చేసే ప్రక్రియను, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన యంత్రపరికరాలైన బిస్కెట్ల తయారీ యంత్రాన్ని, టమోటా సాస్‌ తయారు చేసే ప్రక్రియను, చిరుధాన్యాల ప్రొసెసింగ్‌ యంత్రాలను, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారుచేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా మరియు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోపడే తేనెపెట్టెలను, పుట్టగొడుగుల తయారీ యూనిట్‌ను ప్రత్యక్షంగా సందర్శించి రైతులకు మరియు నిరుద్యోగులకు ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ అందించే సేవలను అభినందించారు.