ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ చిన్ననీటి వనరుల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులను సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నారు.