పోలవరం ఆలస్యమైతే మరో సీజన్‌ కోల్పోతాము కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంథ్రేఖర్‌, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు.