పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణం నేడు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతించింది. టీ5 ప్లాస్టిక్‌ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్‌ నిర్మించుకుంటూ రావాలి. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్‌ చేపడుతోంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్ల వంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. డయాఫ్రం వాల్‌ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Read More

పోలవరం ప్రాజెక్టులో నాణ్యత చాలా ముఖ్యం

ఎదురయ్యే అన్ని సమస్యలను అధిగమిస్తూ… 2028 మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేయడమే కాదు… నాణ్యత కూడా చాలా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఇటీవలవరకూ పోలవరం ఎడమకాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయని, రూ. 960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అధికారులు చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్‌సి ఎం. వెంకటేశ్వరరావు, బావర్‌, మేఘా ప్రతినిధులు, ఇంజనీరింగు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read More

పోలవరం ప్రాజెక్టు గురించి విదేశీ బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలపై నవంబరు 6 నుంచి నాలుగు రోజుల పాటు మేథోమథనం చేయనున్నారు. ప్రాజెక్టును సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్ళను పరిష్కరించడంపై నిపుణులు చర్చించనున్నారు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్‌ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్‌ బి. పాల్‌, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌లతో కూడిన విదేశీ బృందంతో సంబంధిత అధికారులు, నిపుణులు నవంబరు 6 నుంచి 9వ తేదీ వరకు మేథోమధనం చేయనున్నారు.

Read More

2027 నాటికి పోలవరం సాగునీటి ప్రాజక్టు పూర్తి కావాలి : చంద్రబాబు

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి, సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లను ఆప్రై సంస్థ… పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్‌కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్‌.. డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తామని వివరించారు. కొత్త వాల్‌కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

Read More

సాగునీటి వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తాము

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, నవంబరు మొదటి వారానికల్లా వాటిని పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయని, ఓటర్ల జాబితాలు నవీకరిస్తున్నారని శుక్రవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి, వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా సాగునీటి సంఘాలను సమన్వయం చేసుకుంటూ జలవనరుల శాఖ పని చేస్తుందన్నారు.

Read More

పోలవరానికి త్వరగా నిధులివ్వండి

పోలవరం ఆలస్యమైతే మరో సీజన్‌ కోల్పోతాము కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంథ్రేఖర్‌, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు.

Read More

పోలవరం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ జాతీయ ప్రాజెక్ట్‌ కాబట్టి 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాని భాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే అని వాగ్ధానం చేశారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణాలకు 15 వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలతో ఇప్పిస్తామని కూడా వాగ్ధానం చేశారు. ఈ పరిణామాలతో పోలవరం ఆయకట్టు రైతుల, రాజధాని రైతుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.

Read More