రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని, రైతులకు అండగా నిలవాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ కాల్‌సెంటర్లను కొనసాగించాలని, పశువులు మృత్యువాత పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.