గతవారం రోజులుగా నిలకడగా ఉన్న పత్తి ధరలు ఈ రోజు అమాంతంగా పెరిగి క్వింటాలుకు రూ. 7800/- అయ్యింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకి రూ. 7800/-ల చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. ఈ రోజు 131 క్వింటాళ్ళ విడి పత్తిని రైతులు జమ్మికుంట మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ. 7400/-, గరిష్ట ధర రూ. 7800/-లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజలకు, పత్తి బేళ్లకు గిరాకీ పెరిగిన కారణంగానే పత్తి ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.