తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె

తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సీఎండీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా మరియు పత్తిని తక్కువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.

Read More

పత్తి కొనుగోలుపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు కార్యకలాపాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని, రైతులకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో మేజర్‌ మార్కెట్‌ కమిటీలను ఆధునీకరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్‌లో జరిగిన పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్‌ పోర్టల్‌ తయారు చేయడం జరిగిందని, దీని ద్వారా సీసీఐ వారు ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేశారో, ఎంత పత్తిని రిజెక్ట్‌ చేశారో అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని మంత్రి అన్నారు. మార్కెటింగ్‌ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్‌ మార్కెటింగ్‌ శాఖ వారికి అందించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శితో మాట్లాడి, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని తెలిపారు.
మార్కెటింగ్‌ సెంటర్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉంచుకున్నట్టయితే అధిక మద్ధతు ధరను పొందవచ్చని, అలాగే పత్తి అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ చాట్‌ యాప్‌ (8897281111) ద్వారా తెలియజేయగలరని మంత్రి పేర్కొన్నారు.

Read More

తెల్ల బంగారానికి రికార్డు ధర

గతవారం రోజులుగా నిలకడగా ఉన్న పత్తి ధరలు ఈ రోజు అమాంతంగా పెరిగి క్వింటాలుకు రూ. 7800/- అయ్యింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకి రూ. 7800/-ల చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. ఈ రోజు 131 క్వింటాళ్ళ విడి పత్తిని రైతులు జమ్మికుంట మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ. 7400/-, గరిష్ట ధర రూ. 7800/-లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజలకు, పత్తి బేళ్లకు గిరాకీ పెరిగిన కారణంగానే పత్తి ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Read More