దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణ నష్టం అంతగా ఉండదు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగష్టు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువుగా వచ్చును.
వ్యాధి ఎలా వస్తుంది?
ఇది పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన అప్తోస్ వైరస్ వల్ల వస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాల ద్వార దూడలకి వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
1) జ్వరం 103-106 డిగ్రీల ఫారెన్హీట్కి పెరుగుతుంది.
2) పశువుల నోటిలో, చిగుళ్ళు పై పొక్కులు ఏర్పడటం వల్ల అవి మేత మరియు నీళ్ళు తీసుకోలేక నీరసించిపోతాయి.
3) నోరు మరియు గిట్టలు మధ్యలో బొబ్బలు ఏర్పడటం, 2-3 వారాల్లో అవి చితికి పుండ్లుగా మారటం.
4) నోటి నుంచి చొంగ కారుతుంది. 5) పాల ఉత్పతి తగ్గుతుంది.
వ్యాధిని ఎలా నివారించాలి
1) వ్యాధి సోకిన వాటిని వేరు చెయ్యాలి
2) పశువుల పాకని క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
3) చనిపోయిన పశువులని సున్నపు గోతిలో పూడ్చాలి.
4) వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకి త్రాగించాకూడదు.
5) మార్చి-ఏప్రిల్ మరియు ఆగష్టు -సెప్టెంబర్ మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టికా (ఓఖఈ వాక్సిన్) వేయించాలి.
చికిత్స
1. కాలిగిట్టలు మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా వేపనూనె రాయాలి.
2. నోటిలోని పుండ్లకీ గ్లిసరిన్, బోరిక్ పౌడర్ని కలిపి పుయ్యాలి.
3. డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.
డా.టి.జశ్వంత్ రెడ్డి, శాస్త్రవేత్త (పశు వైద్య విభాగం), డా.పి.వెంకట సుబ్బయ్య, సమన్వయకర్త, డా.ఎన్.రాజ శేఖర్, శాస్త్రవేత్త (సస్య రక్షణ), డా. కే. లక్ష్మికళ, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎన్.శివ ప్రసాద్, శాస్త్రవేత్త (సస్య పోషణ), డా.ఐ.వెంకట రెడ్డి, శాస్త్రవేత్త (వ్యవసాయ విస్తరణ విభాగం), డా.ఆర్.ప్రభావతి, శాస్త్రవేత్త (గృహవిజ్ఞాన విభాగం) డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య. ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.

