ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, నవంబరు మొదటి వారానికల్లా వాటిని పూర్తి చేస్తామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయని, ఓటర్ల జాబితాలు నవీకరిస్తున్నారని శుక్రవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి, వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా సాగునీటి సంఘాలను సమన్వయం చేసుకుంటూ జలవనరుల శాఖ పని చేస్తుందన్నారు.