బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు పొంచి ఉంది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పటానికి పరిస్థితులు అనుకూలించి అవి క్రమేపి వాయుగుండాలు, తుపాన్లుగా మారుతాయి. పంటలు చేతికొచ్చే సమయాల్లో తుపాన్లు వస్తే పంటలు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ కోరింది.అక్టోబరు-డిసెంబరు మధ్యలో రాష్ట్రంపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లుసంవత్సరం తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు2014 అక్టోబరు (హుద్‌హుద్‌) విశాఖపట్నం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం2016 డిసెంబరు (వార్ధా) చెన్నై సమీపంలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప2018 అక్టోబరు (తిత్లీ) పలాస సమీపంలో శ్రీకాకుళం, విజయనగరం2018 డిసెంబరు (పెతాయ్‌) కాకినాడ సమీపంలో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి2021 సెప్టెంబరు (గులాబ్‌) కళింగపట్నం విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం2022 డిసెంబరు (మాండౌస్‌) మహాబలిపురం సమీపంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప2023 డిసెంబరు (మిచౌంగ్‌) బాపట్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు