ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె

జన్యు సవరణ ద్వారా సృష్టి

ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్‌ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్‌ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్‌) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

Read More

పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేది. 13.11.2024 నాడు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్‌ ప్రధానమైనది. నిజామాబాద్‌ పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుంచి పసుపు మద్ధతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి అవకాశాలు పెంచడానికి, పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (1757 ఎకరాలలో) మరియు ఖమ్మం జిల్లా (696 ఎకరాలలో)ల నుండే 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ జిల్లాలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడ కొబ్బరితోటల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రత్యేకంగా రీజనల్‌ కోకోనట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
కోకోనట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణలో తగిన సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను మరియు నూతన వంగడాలను రైతులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
అలాగే తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్‌ ఆయిల్‌ సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే పామ్‌ ఆయిల్‌ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్‌ పామ్‌ పై పరిశోధనలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల పామ్‌ ఆయిల్‌ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్‌ ఆయిల్‌ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ, సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Read More

చెరకు రైతుకు కేసీపీ తీపి కబురు

టన్ను ధర రూ. 3,576/-
కేసీపీ చక్కెర కర్మాగారం 2024-2025 సీజన్‌కు చెరకు ధర టన్నుకు రూ. 3,576/-గా ప్రకటించింది. కర్మాగార ఆవరణలో శుక్రవారం యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాస్‌ అధ్యక్షతన చెరకు రైతు సంఘం నేతలతో జరిగిన సమావేశంలో చెరకు గానుగాడు ప్రస్తుత సీజన్‌కు ధర సబ్సిడీతో కలిసి రూ. 3,576/-గా ప్రకటించారు. యాంత్రీకరణకు అనువుగా సాగు చేసిన రైతులకు టన్నుకు రూ. 3,676/- సబ్సిడీతో కలిపి చెల్లించనున్నట్లు సీతారామదాస్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరులో అకాల వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు సంఘం విన్నపం మేరకు రూ. 40.89 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. రానున్న సీజన్‌కు ఈ సంవత్సరం నవంబరు నుంచి 2025 ఫిబ్రవరి వరకు నాటే చెరకు తోటలకు ఎకరానికి రూ. 10,000/- సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. సబ్సిడీతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో నాటిన తోటలకు టన్నుకు రూ. 400/- లేదా యాంత్రీకరణ అనువుగా వేసిన తోటలకు టన్నుకు రూ. 500/- సబ్సిడీగా ప్రకటించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని విరివిగా చెరకు సాగు చేసి తోడ్పడాలని కోరారు.

Read More

తుపాన్ల కాలం… అప్రమత్తత అవసరం

బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు పొంచి ఉంది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పటానికి పరిస్థితులు అనుకూలించి అవి క్రమేపి వాయుగుండాలు, తుపాన్లుగా మారుతాయి. పంటలు చేతికొచ్చే సమయాల్లో తుపాన్లు వస్తే పంటలు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ కోరింది.అక్టోబరు-డిసెంబరు మధ్యలో రాష్ట్రంపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లుసంవత్సరం తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు2014 అక్టోబరు (హుద్‌హుద్‌) విశాఖపట్నం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం2016 డిసెంబరు (వార్ధా) చెన్నై సమీపంలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప2018 అక్టోబరు (తిత్లీ) పలాస సమీపంలో శ్రీకాకుళం, విజయనగరం2018 డిసెంబరు (పెతాయ్‌) కాకినాడ సమీపంలో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి2021 సెప్టెంబరు (గులాబ్‌) కళింగపట్నం విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం2022 డిసెంబరు (మాండౌస్‌) మహాబలిపురం సమీపంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప2023 డిసెంబరు (మిచౌంగ్‌) బాపట్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు

Read More