డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ సెక్రటరీ గారు సోయాబీన్‌ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో, ఇప్పటిదాకా జరిగిన సోయాబీన్‌ సేకరణ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్యామ్యూల్‌ మాట్లాడుతూ, ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రాలను కూడా అధిగమించిందని తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్‌ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుండి సేకరించినట్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుండి 10 క్వింటాళ్ళకు పెంచడం జరిగిందని, మన రాష్ట్రం నుండి సమీక్షలో పాల్గొన్న మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.