చేనులో ఉన్న పత్తి పంట: వాతావరణ మార్పుల వేళ ప్రస్తుత యాజమాన్యం

విత్తడం పూర్తయ్యి, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం శాఖీయ పెరుగుదల నుంచి పూత, పిందె దశల్లో ఉంది. వర్షాల మధ్య పొడి వాతావరణం, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రి ఉష్ణోగ్రత మార్పులు చీడపీడల ఉధృతిని వేగంగా మారుస్తున్నాయి. కాబట్టి రైతులు క్యాలెండర్ ప్రకారం మందులు పిచికారీ చేయకుండా, చేనులో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.

పొలంలో తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు
ప్రతి 3–4 రోజులకు పత్తి చేనులో గులాబీ రంగు పురుగు (కాయ తొలచే పురుగు) లక్షణాలను తప్పనిసరిగా పరిశీలించాలి; పూత దశలో ముడుచుకున్న గులాబీ పువ్వులు కనిపిస్తున్నాయా, అలాగే 10–15 రోజుల పచ్చికాయలను కోసి చూస్తే లోపల పురుగు లేదా నల్లటి మచ్చలు ఉన్నాయా చూడాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల అడుగుభాగంలో తామర పురుగులు, తెల్లదోమ ఉధృతి పెరుగుతుందనే కారణంగా ఆకులు దోనెల్లా లేదా పసుపు రంగులోకి మారుతున్నాయా గమనించాలి. అలాగే వర్షాల తర్వాత గాలిలో తేమ పెరిగినప్పుడు కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతున్నాయా, కాయ కుళ్ళు లేదా బ్యాక్టీరియల్ తెగుళ్ల లక్షణాలను కూడా పరిశీలించాలి.

నాన్-బిటి విత్తనాలు వేయకపోతే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
విత్తనాల సమయంలో సరిహద్దు పంటలు (నాన్-బిటి పత్తి లేదా కందులు) వేయకపోవడంతో గులాబీ రంగు పురుగు నేరుగా పత్తిపై దాడి చేసే అవకాశం పెరుగుతుంది. దీనిని తగ్గించేందుకు ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు కట్టి, రోజుకు ఒక్కో బుట్టలో 8 కంటే ఎక్కువ రెక్కల పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉన్నట్లు భావించాలి. అలాగే ఎకరానికి 10–15 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను పైరు ఎత్తుకంటే కొద్దిగా పైన అమర్చడం ద్వారా రసం పీల్చే పురుగులను సుమారు 40% వరకు తగ్గించవచ్చు.

పిచికారీ వ్యూహం (MoA Rotation)
45–90 రోజుల పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు వేప నూనె (NSKE 5%) లేదా నింబిసిడిన్ పిచికారీ చేస్తే సాలీళ్ళు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి మిత్రపురుగులు రక్షించబడతాయి. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి (ETL) దాటినప్పుడు శాస్త్రీయంగా సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. అలాగే ఒకసారి వాడిన మందును తదుపరి పిచికారీలో మళ్లీ వాడకూడదు.

భారీ వర్షాలు కురిసినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలు
పొలంలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపాలి; లేకపోతే వేరు కుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. గాలిలో ఆర్ద్రత పెరిగినప్పుడు Bacillus thuringiensis (Bt) లేదా NPV వంటి బయో-పెస్టిసైడ్స్ వాడకం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

లేట్ ఫ్లష్ (చివరి ఏరుత)లో దిగుబడి తగ్గకుండా పురుగు నియంత్రణ వ్యూహం
చాలామంది రైతులు డిసెంబర్–జనవరిలో వచ్చే చివరి ఏరుత ద్వారా అదనపు ఆదాయం ఆశించినా, ఈ దశలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందుల మోతాదు పెంచి అధిక ఖర్చు చేయకుండా, PB-Rope లేదా లింగాకర్షక బుట్టల్లో ల్యూర్‌లు మార్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గించాలి. కాయ తొలిచే దశలోనే తక్కువ ఖర్చుతో జీవ నివారణ పద్ధతులు లేదా సిఫార్సు చేసిన స్ప్రేలు వాడాలి. చివరి ఏరుత అనంతరం పత్తి కట్టెలను పొలంలో వదలకుండా రొటోవేటర్ లేదా షెడ్డర్‌తో తుంచితే మిగిలిన పురుగులు, కోశస్థ దశలు నశించి తదుపరి పంటకు పొలం పరిశుభ్రంగా ఉంటుంది.

వాతావరణ మార్పుల ప్రభావం పత్తి సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని అధిగమించడం రైతు చేతుల్లోనే ఉంది. అధిక రసాయన పిచికారీలు పరిష్కారం కాదు; అవి ఖర్చు పెంచి పురుగుల్లో నిరోధక శక్తిని పెంచుతాయి. శాస్త్రీయ పర్యవేక్షణ (ETL), లింగాకర్షక బుట్టల వినియోగం, సకాలంలో మందుల మార్పిడి, పొలం పరిశుభ్రత ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. సాంప్రదాయ పద్ధతులకంటే క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే రైతు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలను సాధించగలడు.

“పరిస్థితులు మారినప్పుడు మన వ్యూహం మారాలి — శాస్త్రీయ పర్యవేక్షణే పత్తి రైతుకు నిజమైన రక్షణ!”.

  • జి. యశస్విని, ఎస్. కార్తీక్. 8463976019, 6301187682
Read More

ఔషధ మొక్క…. కాగితాల పువ్వు

కాగితాల పువ్వు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఇది అన్ని చోట్లా పెరుగుతుంది. దీనిని హెడ్డి, పొద, ప్రాకే తీగగా కుండీల్లో పెంచవచ్చు. ఇది పదునైన మందమైన ముళ్ళు కలిగి ఉంటుంది. కనుక పశువులు, మేకలు, కోతులు, పక్షులు హని కలిగించవు. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. వేడి, పొడి వాతావరణంలో కొన్ని రకాలు కాంతివంతంగా, ఆకర్షణీయమైన రంగులలో పెరుగుతాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈపూవుకి గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేసింది.

సాధారణ నామం : బోగన్ విల్లియా శాస్త్రీయ నామం : బోగన్ విల్లియా గ్లాబ్రా/ బోగన్‌విల్లియా సైక్టాబాలిస్ కుటుంబం: నిక్టాజినేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఈ మొక్క ఆకులు పినిటోల్ అనే రాసాయనం కలిగియుండి మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ చికిత్సలకు ఆకులను ఉపయోగిస్తారు.
  • కాగితాల పూలతో తయారు చేసిన టీని, శ్వాసకోశవ్యాధుల నివారణకు త్రాగిస్తారు.
  • ఈ మొక్క పూలు, కాండాలను ఎండబెట్టి నీటిలో మరిగించి టీ లాగా త్రాగుతారు.
  • ఆకులను డయేరియా, చికిత్సలలో ఉపయోగిస్తారు. దగ్గు, గొంతునొప్పి, ఎసిడిటి నివారణకు ఉపయోగిస్తారు.
  • పూల ద్రావణాన్ని తక్కువ రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కొమ్మలు హెపటైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • కాగితాల పువ్వు మొక్క ఆకుల పొడి (10 గ్రా. గాఢత) చిక్కుడు గింజలు నిల్వ సమయంలో ఆశించే బీన్‌వీలిల్, అకాంతో సెలిడెస్ ఓబ్టెక్టస్‌ని అత్యధికంగా చంపింది. (విల్సన్, అతని అనుచరుడు, 2016) ఆకులలో ఫినాల్ అధిక పరిమానంలో వున్నాయి కనుక కీటక నాశక చర్య ప్రదర్శించాయి. (లీ, అతని అనుచరులు, 1997)
  • కాగితాల పువ్వు మొక్క ఆకుల డ్రావణం టమాట, చిక్కుడు పంటల నాశించే అనేక వైరస్ తెగుళ్ళను నివారిస్తుంది.
  • ఆకుద్రావణం తయారీ: ఒక లీటరు నీటిలో 200 గ్రా. తాజా ఆకులను కలిపి కనీసం 5 నిమిషాలు మిక్సీలో కలపాలి.
  • కాగితాల పువ్వు మొక్క ఆకులు మిథనాల్ ద్రావణం వరి పంటనాశించే లద్దె పురుగు స్పోడోప్టెరా మరిషియా 3 నుండి 6వ దశ లార్వాలు, పూలపై లార్వా సైడల్‌పై మరియు ప్యూపెసైడల్ చర్య ప్రదర్శించాయి. ఆకుల ద్రావణం { కీటక పెరుగుదల క్రమబద్దీకరం, ఫ్యూఫెనోక్సురాన్ పిచికారి స్పొడోప్టెరా మరిషియా నివారణకు అత్యత్తమ ఎంపిక అని ఫలితాలు వెల్లడించాయి. (ప్రసీజ, అతని అనుచరులు, 2015)
  • బోగన్ విల్లియా ఆకు ద్రావణం ఈడెస్ ఈజిప్టు లార్వా, ప్యూపాలను చంపింది. (రాజమోహన్ Ê లోగన్ కుమార్, 2012)
  • బోగన్‌విల్లియా స్పెక్లిబాలిస్ ఆకు ద్రావణం అలసంద, పొద్దుతిరుగుడు పంటల నాశించే సన్‌ఫ్లవర్ నైక్రోసిస్ వైరస్‌లను తగ్గించింది (సోమేశ్వర్ భాగత్, అతని అనుచరులు, 2016)

బోగన్ విల్లియా ఆకుల కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు – 1 కి., బోగన్ విల్లియా, ఆకులు 1 కి., బొప్పాయి ఆకులు – 1 కి. పసుపు పొడి – 200 గ్రా.

తయారు చేసే విధానం

  • పైన సూచించిన ఆకులను పసుపు పొడిని పైన పేర్కొన్న మోతాదులో తీసుకుని ఆకులను బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడక బెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి నిల్వ వుంచకుండా వేంటనే ఒక ఎకరంలో పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
  • పంటకాలంలో పంట దశ,తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.

నివారించబడే పురుగులు

  • బోగన్ విల్లియా ఆకులలో వున్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశణిగా, వికర్షినిగా పనిచేస్తాయి.
  • బోగన్‌విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్ నివారిస్తాయి.
  • బోగన్ విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తాయి.

నివారించబడే తెగుళ్ళు

  • బోగన్ విల్లియా ఆకుల కషాయం పసుపు పెసర వంటి పంటల నాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… గొబ్బి

గొబ్బి 60-100 సెం.మీ. ఎత్తు పెరిగే ఒక పొద. ఆకుల పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో, అడుగుభాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు అండాకారం నుండి వెడల్పు తక్కువ గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూలు సుమారు 5 సెం.మీ. పొడవు కలిగి గరాట ఆకారంలో ఉంటాయి. ఊదారంగు, లేత గులాబి రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. పొడవుండి కోడిగుడ్డు ఆకారంలో చిన్న సంచివలె ఉంటుంది. కాయ ముదిరినపుడు మెరుస్తూ ఉంటుంది.

సాధారణ నామం : హైగ్రోఫిలా/టెంపుల్‌ప్లాంట్/మార్ష్‌బార్బెల్ శాస్త్రీయ నామం : బార్లేరియా క్రిస్టేట కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • థాయ్‌లాండ్‌లో గొబ్బిని సంప్రదాయ మూలికా సంబంధ మందుగా ఉపయోగిస్తారు. ఇది టానిక్, మూత్ర వర్థకం, మరియు రక్తశుద్దికారిణిగా పనిచేస్తుంది. తమిళనాడులో మహిళలు ఈ పూలను పూల చెండుగా ఉపయోగిస్తుంటారు.
  • దీని ఆకులు, వేర్ల వగరు రసం యాంటిబాక్టీరియల్, స్వేదనకారి, కఫహర లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీవ్ర జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులు, వేర్ల కషాయాన్ని ఉడుకు, పుండుపై వాపులను తగ్గించడానికి పూస్తారు. గొబ్బి విత్తనాలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఆకుల మిథనాల్ ద్రావణం వాపు, నొప్పి తగ్గించే చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కలను అలంకరణ హెడ్ౙిగా పెంచుతారు.
  • ఈ మొక్కకి యాంటి ఆక్సిడెంట్, యాంటి డయాబెటిక్ లక్షణాలున్నాయి. బార్లేరియా ఇమ్‌ప్యూలినా మొక్కకి గాయం నయం చేసే ప్రభావముంది.

వ్యవసాయరంగంలో…

  • బార్లేరియా లాంగిఫోలియా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలోని కౌమారిన్, సపానిన్స్, టానిన్స్, స్టీరాయిడ్స్, స్పోడోప్టెరా లిటూరాపై అధికంగా 79.40% యాంటి ఫీడెంట్ చర్య, 77.36% లార్వానాశక చర్య ప్రదర్శించాయి. హెలికోవర్పా ఆర్మిజరాపై 70.96% యాంటి ఫీడెంట్ చర్య, 68-70% లార్వానాశక చర్య ప్రదర్శించింది. రూపుమారిన లార్వాలు, ప్యూపాలు, పెద్ద పురుగుల శాతం కూడా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలో నమోదైంది. పెద్ద పురుగులు విడుదలయ్యే శాతం కూడా తగ్గింది (చెన్నియన్, అతని అనుచరులు, 2016).
  • బార్లేరియా ప్రయోనిటిస్ యాంటిఆక్సిడెంట్, యాంటిమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించింది. దీనిని పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు (కరుప్పుసామి, 2007)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వృథా నీటితో వరి పంటకు జీవం

నిర్మల్ జిల్లా మామడ మండలం పరి మండల్‌కు చెందిన రైతు సంతోష్ రెండెకరాల వరి చేతికొచ్చే పరిస్థితిలో బోరులో నీరు అడుగంటింది. గట్టెక్కడం ఎలా అని మధనపడుతుంటే… ఎగువ పొలాలు తడవగా.. పొర్లి దిగువకు వృథాగా పోతున్న నీరు కనిపించింది. దాన్ని కల్వర్టు దగ్గరే ఆపి మళ్లించాలనుకున్నారు సంతోష్. ఇసుక బస్తాలు, టార్పాలిన్‌తో అడ్డుకట్ట వేసి.. చిన్న బావిలా మార్చారు. మోటారు, పైపుల సాయంతో ఆ నీటిని 300 మీటర్ల దూరంలోని తన పొలానికి అందిస్తున్నారు.

Read More