పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు బయోచార్ (జీవబొగ్గు) విధానాన్ని అమలు చేయాలని కొండాలక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు దహనం జరుగుతున్న నేపథ్యంలో.. వ్యవసాయానుబంధ శాఖలు, వర్సిటీలతో అధ్యయనం చేయించి, నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి తమ శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. పంట వ్యర్థాలతో రూపొందించే బయోచార్ విధానం దీనికి సరైన పరిష్కారమని చర్చించారు. పొలంలో గొయ్యి తీసి దానిలో పంట వ్యర్థాలను వేసి దహనం చేసి బొగ్గుగా మార్చి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనిపై హైదరాబాద్లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించారు.

11 Jun, 2026
బయోచార్గా పంట వ్యర్థాలు
#AgricultureDevelopment, #AgricultureInnovation, #AgriTech, #Biochar, #BiocharTechnology, #ClimateSmartAgriculture, #CropResidueManagement, #CropWasteUtilization, #EcoFriendlyFarming, #EnvironmentalProtection, #Farmers, #FarmWaste, #GreenFarming, #horticultureuniversity, #OrganicFarming, #SoilFertility, #SoilHealth, #SustainableAgriculture, #TelanganaAgriculture, #WasteToWealth, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
