విస్తరణ సేవలను పటిష్టం చేస్తున్న కోరమాండల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గ్రోమోర్ గ్రామ్ పేరుతో వ్యవసాయ విస్తరణ సేవలను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో, 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఈ మోడల్ గ్రామాల రైతులు సమతుల్య పోషక పద్ధతులను అవలంబించి, స్థిరమైన దిగుమతులు సాధించేలా వారిని సాధికారులను చేస్తామని కోరమాండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధబ్ అధికారి తెలిపారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడటం, ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ, రైతులకు కొత్త సాగు పద్దతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

Read More

సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా పెరుగుతుంది

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులు 11.17 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు కొన్నారని, ఇది గతం కంటే 3.5 రెట్లు ఎక్కువని, దేశంలో రైతులు క్రమంగా సేంద్రియ ఎరువుల దిశగా మళ్లుతున్నారని కేంద్రం సోమవారం వెల్లడించింది. దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల అందుబాటు విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. “2026 ఖరీఫ్‌నకు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ శాఖ తిరిగి అంచనా వేసింది. సీజన్‌లో మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ నిర్ధారించుకుంది. ప్రస్తుతం దేశంలో 197.56 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి” అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా ఎస్ శర్మ వెల్లడించారు.

Read More