యంత్రపరికరాలను రైతులకు వ్యక్తిగతంగా అందించాలి ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ మాలెపాటి సుబ్బానాయుడు

వ్యక్తిగత యంత్రపరికరాలు రైతులకు అందించాలని ఆగ్రోస్‌ చైర్మన్‌ మాలెపాటి సుబ్బానాయుడు సూచించారు. ఆగ్రోస్‌ అభివృద్ధికి కార్యాచరణపై ఏపీఆగ్రోస్‌ జిల్లాల మేనేజర్లతో బుధవారం ఆయన వడ్డేశ్వరంలోని కార్యాలయంలో సమీక్షించారు. సమావేశంలో వీసీఎండీ ఢిల్లీరావు, జీఎం రాజమోహన్‌, మేనేజర్‌ కూర్మారావు, ఎస్‌ఈ హరిబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Read More

తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును భరించమని కేంద్ర వ్యవసాయ మంత్రికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి వినతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది దిగుబడులు పెరగడము వలన తోతాపురి మామిడి ధరలు తగ్గాయి. దీంతో రైతులు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కిలో మామిడికి కనీస మద్దతు ధరను రూ.12గా నిర్ణయించింది. అందులో వ్యాపారులు 8 రూపాయలు, మిగిలిన 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయించింది. ఈ ఏడాది 6.50 లక్షల టన్నుల సరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా. కిలోకు రూ.4 చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.260 కోట్ల భారం పడుతోంది. ప్రభుత్వ ఆర్ధిక సమస్యల దృష్ట్యా ఈ మొత్తాన్ని కేంద్రమే అందించేలా చర్యలు తీసుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

ప్రారంభం అయిన వ్యవసాయ డిప్లమా కోర్సుల కౌన్సిలింగ్‌

తెలంగాణా రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్‌ ప్రారంభం అయింది. మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని శ్రీవర్ధన్‌కి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ అందచేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పాలిటెక్నీక్స్‌ డాక్టర్‌ కె. ఝాన్సీ రాణి, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ కే బీ ఈశ్వరి, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డాక్టర్‌ కే వీ రమణా రావు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎం. మల్లారెడ్డి, ప్రొఫెసర్‌, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌, విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకి చెందిన సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More

ఈ ఏడాది 18 లక్షల టన్నుల పశుగ్రాసం సాగు

పశుగణాభివృద్ధితో పాటు మేలురకం పశుగ్రాసాల సాగు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభించింది. ఇవి ఈ నెల 14 వరకూ కొనసాగనున్నాయని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి.దామోదరనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పశుపోషకులకు 75 శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలు పశు వైద్య కేంద్రాలు / రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రూ.28.54 కోట్ల వ్యయంతో 3,622 మెట్రిక్‌ టన్నుల విత్తనాలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది 72,440 హెక్టార్లలో 18.11 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశామని ప్రకటించారు. పశుపోషకులకు ఖర్చులు తగ్గించేందుకు 100 శాతం రాయితీపై పశుగ్రాసాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.

Read More

81 గ్రామాలలో అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సౌర ఫలకాలు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో పూర్తిగా సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పుపై, వ్యవసాయ బోర్లకు, ఇతర కరెంటు కనెక్షన్లన్నింటికీ సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.1,273 కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీచేసింది. ఇందులో రూ.400 కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెల 24లోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది. ఈ గ్రామాల్లో 16,840 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ధరల్లో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.4.50 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది.

Read More

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆదివారం కృష్ణా జలాలను బనకచర్లకు విడుదల చేసేందుకు వచ్చిన మంత్రి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం అని వెల్లడించారు. దెబ్బతిన్న అలగనూరు రిజర్వాయర్‌ బండ్‌, గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు పూజలు చేశారు. 10 వేల క్యూసెక్కుల శ్రీశైలం వెనుక జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బనకచర్లకు విడుదల చేశారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి జలహారతినిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖరరెడ్డి, ఈఈ నాగేంద్రప్రసాద్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు

Read More

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో జొన్నల ఆహారం

కర్ణాటక విధానంపై అధ్యయనం చేయనున్న అధికారులు

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారంతో పాటు కర్ణాటక తరహాలో జొన్నలతో చేసే రొట్టె, ఇతర పదార్థాలను అందించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సంఘాలతో వీటిని తయారు చేయించి సరఫరా చేసేందుకు యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై సీఎం తాజాగా నిర్వహించిన సమీక్షలో కర్ణాటక తరహాలో ఇక్కడా జొన్నరొట్టె ఇవ్వాలని, మహిళా సంఘాలతో తయారు చేయించాలని సూచించారు. దీంతో అధికారులు దీనిపై దృష్టిసారించారు. ప్రస్తుతం కర్ణాటక అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద సంవత్సరంలో మూడు వందల రోజులపాటు జొన్నలతో ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడీ తయారు చేసి ఇస్తున్నారు. అక్కడి విధానంపై అధ్యయనానికి త్వరలో తెలంగాణ స్త్రీ శిశుసంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారుల బృందాన్ని పంపించనున్నారు. వారు తుది నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. జొన్నరొట్టెలను మహిళలు, కౌమార బాలికలకు, ఇతర పదార్థాలను పిల్లలకు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జొన్నల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సాగు వానాకాలంలో 50 వేల ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాలు ఉంది. అంగన్వాడీలకు ఆహార పథకంగా చేపట్టిన పక్షంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More

‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు 8 నుంచి కౌన్సెలింగ్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ‘అగ్రి’ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ”ర్యాంకులు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు మొత్తం తీసుకురావాలి. కౌన్సెలింగ్‌ తేదీల వారీగా ర్యాంకులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించండి” అని స్పష్టం చేశారు.

Read More

రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డి-క్రిషి యాప్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్‌, మొబైల్‌ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు.

Read More

జులై 31వ తేదీన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం

  • రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌
    ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జులై 31న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు. 01-11-2021 నుండి 31-10-2022 కాలం మధ్య చదివి ఉత్తీర్ణులైన 153 మంది పి.జి., పిహెచ్‌డి విద్యార్థులకి, 691మంది యుజి విద్యార్థులకి పట్టాలని ఈ స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ మెరిట్‌ సాధించిన 33 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు, 14 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్‌ కార్డు మరియు డ్రెస్‌ కోడ్‌ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in లో జూలై 20వ తేదీ 2025 నుంచి అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రార్‌ వివరించారు.
Read More