తెలంగాణా రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్‌ ప్రారంభం అయింది. మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని శ్రీవర్ధన్‌కి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ అందచేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పాలిటెక్నీక్స్‌ డాక్టర్‌ కె. ఝాన్సీ రాణి, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ కే బీ ఈశ్వరి, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డాక్టర్‌ కే వీ రమణా రావు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎం. మల్లారెడ్డి, ప్రొఫెసర్‌, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌, విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకి చెందిన సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.