వ్యక్తిగత యంత్రపరికరాలు రైతులకు అందించాలని ఆగ్రోస్‌ చైర్మన్‌ మాలెపాటి సుబ్బానాయుడు సూచించారు. ఆగ్రోస్‌ అభివృద్ధికి కార్యాచరణపై ఏపీఆగ్రోస్‌ జిల్లాల మేనేజర్లతో బుధవారం ఆయన వడ్డేశ్వరంలోని కార్యాలయంలో సమీక్షించారు. సమావేశంలో వీసీఎండీ ఢిల్లీరావు, జీఎం రాజమోహన్‌, మేనేజర్‌ కూర్మారావు, ఎస్‌ఈ హరిబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు.