ధరణి లాగిన్‌…. డిప్యూటీ తహసీల్దార్లకు!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్లతో పాటు భూసమస్యల పరిష్కార భాద్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడచిపోతుంది. కాబట్టి భూసమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతుంది. ఈ క్రమంలో మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమలయితే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

Read More

అరకు కాఫీ అద్భుతం

నరేంద్రమోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘మన్‌-కీ-బాత్‌’ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ అరకు కాఫీ అద్భుతం అన్నారు. దేశీయంగా తయారవుతున్న అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతుంది. కాబట్టి అరకు కాఫీ రుచి గురించి ప్రపంచ దేశాలు సందర్శిస్తున్న సందర్భంలో విదేశీ ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోడి ప్రస్తావిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచి రుచి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరు. సుమారు లక్షాయాభైవేల గిరిజన కుటుంబాలు మమేకమయిన మన అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొండం మన అదృష్టం. ఇప్పటికే అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్‌ అవార్డులు లభించాయి. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి అరకు కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. రుచి అద్భుతంగా ఉంది అని మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అరకు కాఫీ గురించి ప్రధాని మోడి ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించి, ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Read More

ప్రధాని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో సుదీర్ఘ కాలం పాటు రైతులు నిరసనలు తెలియచేసిన పరిస్థితులలో ప్రభుత్వం దిగివచ్చి రైతుల కోరిక మేరకు ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు హామీ ఇచ్చి నిరసనలను విరమింప చేశారు. కాని ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సంయుక్త కిసన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన యాత్ర నిన్న హైదరాబాదు చేరుకున్న సందర్భంలో నిన్న సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. నిరసనలో పాల్గొన్న రైతులపై కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ లభించిన తూటాలను రైతు నాయకుడు సుర్జీత్‌సింగ్‌ ప్రదర్శించారు.

Read More

కుటుంబానికి రెండు లక్షల రూపాయల పంటరుణమాఫీ

                కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో ఇచ్చిన హామీలలో భాగంగా పంట రుణమాఫీ గురించిన మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజులలో విడుదల చేయనున్నారు. కుటుంబానికి రెండు లక్షల రూపాయలకు మించకుండా పంట రుణాలను మాఫీ చెయ్యాలనే యోచనలో ఉన్నారు. బంగారం తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకున్న రుణాలు ఈ పరిధిలోకి రావని స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంటరుణాలు మాత్రమే మాఫీ అవుతాయి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Read More

బీడు భూములకు గోదావరి జలాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడుభూములకు గోదావరి జలాలను అందించటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు.

Read More

పట్టాదారు పాస్‌ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేస్తాము. మీ తాతముత్తాతలకు సంబంధించిన భూమికి ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై గత ప్రభుత్వం జగన్‌ బొమ్మను వేసుకొంది. మేము అలా చేయము. ఎవరి బొమ్మ వేయం. అన్ని పట్టాదారు పాస్‌ పుస్తకాలు మారుస్తాం. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇచ్చారు.

Read More

రైతు భరోసా … కౌలు రైతులకూ ఇచ్చే యోచనలో ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి ఉన్న కౌలు రైతుకు రైతు భరోసా కోసం.. సబ్‌ కమిటీలో విధివిధానాలు ఖరారు చేసి, కౌలు రైతుల గుర్తింపుకు సంబంధించిన చర్చ జరుగుతుంది.
ఈ సీజన్‌ నుంచే కౌలు రైతులకు కూడా రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల పైబడి ఉంటారని కౌలురైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
  • 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతు చట్టంలో పొందుపరచిన విధివిధానాల ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తారు. కౌలు రైతుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంకు సంబంధించి కౌలుదారు మరియు యజమాని ఇద్దరూ ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలి. ఆ ఒప్పందం గ్రామసభ ఆమోదం పొందాలి.
  • ఇప్పటి వరకు భూమి కౌలు అనేది కేవలం నమ్మకాల మీదనే ఉంటుంది. కాని రైతు భరోసా పొందాలంటే నమ్మకం కంటే చట్టబద్ధం ముఖ్యం కాబట్టి కౌలుదారు యజమాని నుంచి చట్టపరంగా భూమిని కౌలుకు తీసుకుని ఒప్పంద పత్రంపై ఇరువురూ సంతకాలు చేసి ఒప్పందపత్రానికి చట్టభద్రత కల్పించాలి.
  • ఇందుకు సంబంధించిన విధివిధానాల కొరకు మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 15 లోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని సబ్‌ కమిటీని ఆదేశించింది. కాబట్టి త్వరలో సబ్‌ కమిటీ పని మొదలు పెట్టబోతుంది.
Read More