తెలంగాణా బడ్జెట్‌లో వ్యవసాయానికే అగ్రతాంబూలం!

ఎన్నడూలేని విధంగా తెలంగాణా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికే కేటయించడానికి రెడీ అవుతున్నది. ఈ సొమ్మును ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి, పంటల బీమాకు పెద్ద పీట వెయ్యడానికి, రైతు బీమాకు సంబంధించి ప్రీమియం బాధ్యత సర్కారు వహించడానికి, ఉద్యాన పంటల సాగులో కొత్త ఊపును తేవడానికి కేటాయించడానికి సిద్ధం అవుతున్నారు. వీటన్నింటితో పాటు పామాయల్‌ సాగు కోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం కూడా జరిగింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ తన ప్రాధాన్యతలను ఆర్థిక శాఖకు తెలియచేయడం జరిగింది.

Read More

డ్రిప్పు ఇరిగేషన్‌కు సబ్సిడీలు పునరుద్ధరించాలి

ఆంధ్రప్రదేశ్‌లో డ్రిప్పు ఇరిగేషన్‌ సౌకర్యాలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరచిన రాయితీలను గత ప్రభుత్వం రద్దు చేసినందువలన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. దాని ప్రభావం పంట దిగుబడులు మీద కూడా పడి పంట దిగుబడులు తగ్గాయి. మరలా వ్యవసాయరంగానికి పూర్వ వైభవం రావాలంటే డ్రిప్పు ఇరిగేషన్‌కు గతంలో అందించిన 90 శాతం సబ్సిడీని మరలా ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించే ఆలోచన చేయాలని తె.దే.పా. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సీతారామయ్య, విజయబాబు తదితరులు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడిని కోరారు.

Read More

రైతు భరోసాకు ఎకరాల పరిమితిపై అభిప్రాయ సేకరణ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందచేసే రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు అందివ్వాలనే దానిపై రైతులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయించాలని తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రోజుకు మూడు సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. స్థిరాస్థి, బంజరు, ఇతర సేద్య యోగ్యం కాని భూములకు రైతు భరోసా సాయం ఇవ్వరాదని పేర్కొంది. రైతుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Read More

నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపునకు కృషి

నూజివీడు మార్కెట్‌ యార్డు ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి మామిడి రైతులు, వ్యాపారులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరిగింది. వచ్చే మామిడి సీజనుకు నూజివీడులో మామిడి మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, ఫ్రూట్‌ కవర్లు అందించటానికి చర్యలు తీసుకుంటామని, మామిడి రైతులకు అవసరమయిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి, నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రావడానికి తగిన చర్యలు వ్యవసాయ శాఖ మంత్రితో సంప్రదించి తీసుకుంటామని రైతులకు మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.

Read More

కొత్త అప్పులకు రుణమాఫీ వర్తించదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం 11-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న అప్పులకే రుణమాఫీ వస్తుందని తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యకక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కాబట్టి బ్యాంకర్లు రైతులను అప్పులు చెల్లించాలని, రెన్యూవల్‌ చేసుకోవాలని, బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసుకోవాలని రైతులపై వత్తిడి తేవద్దు అని బ్యాంకర్లకు మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 లోపు ఏ ఒక్క రైతూ బ్యాంకు రుణాలను చెల్లించవద్దు. ఒకవేళ చెల్లించి మరలా రుణం తీసుకుంటే అవి కొత్త రుణాలుగా మారతాయి. కాబట్టి కొత్త రుణాలకు రుణమాఫీ వర్తించదు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు పెట్టే ఒత్తిడిని పట్టించుకోవద్దని మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

Read More

ఐ.ఏ.ఎస్‌. అధికారులూ… పొలాలకు వెళ్ళండి

ఐ.ఏ.ఎస్‌. అధికారులు సచివాలయంకే పరిమితం కాకుండా అవకాశం ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి రైతులతో కలిసి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని బుధవారం వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐ.ఏ.ఎస్‌.లను ఆదేశించారు. పాతవిధానంలోనే రైతు భాగస్వామ్యంతోనే బీమా అమలు చేయాలని, పంట కాలువలలో గుర్రపుడెక్క తొలగించి పూడిక తీయాలని, సాగునీటికి కొరత లేకుండా చూడాలని, వృధాగా పోయే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించాలని, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Read More

రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

- వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో తెలంగాణాలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిమ్‌ల పరిష్కారం గురించి, ఆయిల్‌పామ్‌ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పంటరుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే మూడు నెలలలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి తెలియజేశారు. ఎరువుల నాణ్యత, విత్తన నాణ్యత, భూసార పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.

Read More

పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేశారు

ఐదేళ్ళ తరువాత గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు పారుతున్నాయి. ఇందుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుండి కాలువ నుంచి 16 పంపుల ద్వారా 5600 క్యూసెక్కుల నీరు ఈరోజు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వలన నీటి ప్రవాహం పెరుగుతున్నందువలన నీటిని ఈ రోజు విడుదల చేయడం జరిగిందని అధికారులు తెలియచేశారు. గోదావరి జలాలు కృష్ణాడెల్టాలో పారితే వరి దిగుబడులు పెరుగుతాయని 2016 ఖరీఫ్‌ సీజనులో ఋజువయ్యింది. కాని 2019 నుంచి 2023 వరకు గోదావరి జలాలు లేక వరి దిగుబడులు తగ్గాయి. మళ్లీ ఈ ఏడాది పట్టిసీమ నీరు అందుతుందనే వార్త రైతుల్లో ఆనందం నింపుతోంది.

Read More

గోదావరి ఎత్తిపోతల పథకాల వద్ద నీటిమట్టం పెరుగుతుంది

గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పెరుగుతుండటం వలన ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతూ ఉంది. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమ గట్టున పురుషోత్తమపట్నం, పుష్కర, తొర్రిగడ్డ, సత్యసాయి తదితర ప్రాజెక్టుల వద్ద సోమవారం నాటికి నీటిమట్టం 14.2 మీటర్లకు చేరింది. మోటార్లు ఆన్‌ చేస్తే నీరు విడుదలయ్యేలా ప్రవాహం చేరింది. జులై రెండో వారానికల్లా ప్రాజెక్టుల నుంచి మెట్ట ప్రాంతానికి సాగు నీరు విడుదల చేసేలా కార్యాచరణ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Read More

బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి

తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత రైతులకు వరప్రదాయిని అయన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రకు చెందిన ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్‌కు ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్ట్‌లో 0.2 టి.యం.సీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమైన జులై 1వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను తెరచి అక్టోబరు 28వ తేదీన మూసి వేస్తారు. ఈపరిణామంతో నిజామాబాద్‌ రెంటల్‌ మండలం కందకుర్తి, త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది.

Read More