ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డి-క్రిషి యాప్ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్, మొబైల్ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు.

5 Jul, 2025
రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ
#agriculture daily news, #AgriSupport, #AndhraPradeshAgriculture, #APFarmers, #DigitalFarming, #DKrishiApp, #FarmersFirst, #FarmersWelfare, #raithunesthamnews, #RythuSevaKendram, #SeedDistribution, #SubsidySeeds, #ఆంధ్రప్రదేశ్ రైతులు, #కేంద్ర ప్రభుత్వం, #డిక్రిషి యాప్, #రాయితీ విత్తనాలు, #రైతు కోసం, #రైతు సంక్షేమం, #రైతు సేవా కేంద్రం, #విత్తన రాయితీ, #విత్తన విక్రయ కేంద్రం, #విత్తనాల పంపిణీ, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
