ఆహార పదార్థాలలో రసాయన అవశేషాలను గుర్తించే పరికరం

ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెరిగింది. ఎక్కడ చూసినా సేంద్రియం పేరిటే అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి నిజమైన సేంద్రియ ఉత్పత్తులను గుర్తించేందుకు వీలుగా ఆహార పదార్థాల్లో క్రిమి సంహారక అవశేషాలను గుర్తించే పరికరాన్ని బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకులు రూపొందించారు. ఆహార పదార్థాలు, పండ్లు, టమాటాలకు సూక్ష్మ పట్టీని అతికించి ఈ పరికరాన్ని దగ్గరికి తీసుకెళ్తే చాలు.. క్రిమి సంహారక అవశేషాలుంటే రెడ్‌లైట్‌ వెలుగుతుంది. నార్వేలోని ఆర్కిటిక్‌ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రొ. సంకేత్‌ గోయల్‌ నేతృత్వంలో డా.పి. సాయికుమార్‌, పరిశోధక విద్యార్థి రేష్మ, రజనీశ్‌ కౌర్‌లు దీన్ని తయారు చేశారు. దీనికి కెమిలు మినో మీటర్‌ అని పేరు పెట్టారు. పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ మైక్రో మెకానికల్‌లో ప్రచురితమైంది. ఈ పరికరాన్ని వాణిజ్య అవసరాలకు రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రొ. సంకేత్‌ గోయల్‌ వివరించారు.
Read More

మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో కీటకాల పెంపకం

మొక్కలలో పరాగ రేణువులు వ్యాప్తి చెందడానికి కీటకాలు ఎంతగానో తోడ్పడి దిగుబడి పెరుగుతుంది. అందుకోసమే ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కీటకాలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ గొట్టాల్లాంటి వెదురు పుల్లల్లో తుమ్మెద జాతి కీటకాలను ఉంచి, అవి గూళ్లు కట్టి, గుడ్లు పెట్టేలా చూస్తున్నారు. పంటలు పూత థకు వచ్చేసరికి అవి ఎగిరే థకు వస్తున్నాయి. తర్వాత ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకు వాలుతూ పరాగ సంపర్కానికి దోహదపడుతున్నాయి. రైతులు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో వెదురుపుల్లలను అమర్చితే పంటలకు మేలుచేసే కీటకాలు వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కె. మోహనరావు తెలిపారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More

సమిష్టిగా పర్యావరణ మార్పులను ఎదుర్కొందాం: భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర

ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం పై జాతీయ సదస్సులో పిలుపుజాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుపొంచి ఉన్న పర్యావరణ మార్పులను సమిష్టిగా ఎదుర్కోవాలని అప్పుడే మానవాళిని వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని

*భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర* అన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ మార్పులు కేవలం రైతాంగాన్ని, ప్రజలనే కాకుండా వాతావరణ శాఖను సైతం ఇబ్బంది పెడుతుందని అందుకు దీటైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం, ఉద్యాన శాఖ, నాబార్డ్, ఎర్త్ సైన్సెస్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా 18, 19 తేదీలలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాతావరణ అంచనాలు ప్రస్తుతం 40 నుంచి 50% మాత్రమే ఉన్నాయని మల్టీ ఫోర్కాస్ట్ మోడల్స్ తో దీన్ని అధికమిస్తామని ఆయన అన్నారు. మారుమూలలో ఉన్న చిన్న, సన్నకారు రైతుకు సైతం ఈ మార్పుల ప్రభావం తట్టుకునే తరుణోపాయాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి పర్యావరణ మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని అనుగుణంగా సాగులో మార్పులు, తగిన విధానాలు, పంటల ఎంపికలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలని కోరారు. పర్యావరణ మార్పులు, వాతావరణానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి పౌరునికి అందేలా చూడాలని తెలిపారు. పర్యావరణ మార్పులను తట్టుకొని నాణ్యత, అధిక దిగుబడి నిచ్చే పంట రకాల వైపు పరిశోధనలు ముమ్మరం చేయాలి. ప్రతి వ్యక్తికి పర్యావరణ మార్పుల్లోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేటట్టు అందించే ప్రయత్నం భవిష్యత్తులో జరగాలని కోరారు.ఇప్పటివరకు జరిగిన అన్ని పరిశోధనలు, విధానాలు దేశ ఆహార భద్రత కోసమే జరిగాయని, దేశ పోషక భద్రత కోసం అందరు పని చేయాలని అందుకు తగిన విధివిధానాలు రూపొందించుకోవాలని *తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ ఎం.రఘునందన్ రావు* అన్నారు. ఈ లక్ష్యానికి పర్యావరణ మార్పులు అడ్డుగా ఉన్నాయని, పరిష్కరించే ప్రయత్నాలు చేయాలని కోరారు. వాతావరణ శాఖ, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.పర్యావరణ ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న ప్రతి సాంకేతిక, పరిశోధన అంశాన్ని రైతులకు చేరవేసేందుకు l సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం *వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి* తెలిపారు. ప్రభుత్వం, ఉద్యాన శాఖ, విశ్వవిద్యాలయం కలిసి రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండి పర్యావరణ పర్యావరణ మార్పుల ప్రభావాన్ని జయిస్తామని ఆయన చెప్పారు.కార్యక్రమంలో నిపుణులు రూపొందించిన ఇంట్రడక్టరీ అగ్రికల్చర్ మెటీరియాలజీ అనే టెక్స్ట్ బుక్ ను, బుక్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ను ప్రముఖులు విడుదల చేశారు.కార్యక్రమంలో *ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కే ఉదయభాస్కర్, బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా రీజనల్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్*, ప్రముఖ వాతావరణ శాఖ, ఉద్యాన ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

16 ప్రాజెక్టులకు డీపీఆర్‌

వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, గతంలో సర్వేల కోసం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ముందుకు పడని పలు ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 16 పథకాలకు సర్వే, ఇన్వెస్టిగేషన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు (జీవో ఎం.ఎస్‌.నం-34) జారీ చేశారు. ఇన్ని పథకాలకు ఒకేసారి, అదీ ఒకే ఉత్తర్వుతో డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ పలు దఫాలుగా నీటిపారుదలశాఖ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులు, సలహాదారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లతో చర్చించిన తర్వాత అన్ని పథకాలకు ఒకేసారి ఆదేశాలు జారీ అయ్యాయి. *ముఖ్య వివరాలివీ…*ఈ నెల 23 నుంచి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వచ్చిన జీవో లోని ముఖ్యమైన అంశాలు, ఏయే పథకాలకు డీపీఆర్‌ తయారీ అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

* రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును నాలుగు నుంచి పది టీఎంసీలకు పెంచడం. గట్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.32 నుంచి ఐదు లేదా పది టీఎంసీల సామర్థ్యానికి పెంపు. జూరాల నుంచి నాలుగు టీఎంసీలు తీసుకొని అదనంగా 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నెట్టెంపాడు రెండో దశ

* పులిచింతల వెనక భాగం నుంచి బొజ్జతాండా, భీమతాండా ఎత్తిపోతలు. 0.5 టీఎంసీ వినియోగంతో మట్టంపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో 1,380 ఎకరాల ఆయకట్టుకు నీరందించడం. .

* కల్వకుర్తి ఎత్తిపోతల రెండో దశ కింద శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను మళ్లించి 93,531 ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి. ఇందుకోసం కాలువలు, హెడ్‌వర్క్స్‌ సామర్థ్యం పెంచడంతోపాటు తాగునీటికి 7.12 టీఎంసీలు వినియోగించుకొనేలా మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక తయారీ.

* జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 టీఎంసీలు మళ్లించేలా వరద కాలువ పథకం. నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు… మార్గం మధ్యలో చెరువులను నింపడం. జూరాల వెనక భాగం నుంచి వరద సమయంలో 123 టీఎంసీలను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు సరఫరా చేయడం.

* కోయిల్‌సాగర్‌ కింద 3.3 టీఎంసీలతో అదనంగా 13,500 ఎకరాలకు సాగునీరు.

* మహబూబాబాద్‌ జిల్లాలో 1.3 టీఎంసీలతో 13,201 ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు మహబూబాబాద్‌ మండలం ఏదుల పూసపల్లి వద్ద మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మాణం. ఇదే జిల్లాలోని మరిపెడ మండలం విసంపల్లి గ్రామం వద్ద ఆకేరు నదిపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ నిర్మాణం. గార్ల మండలం ముల్కనూరు గ్రామం వద్ద 11,871 ఎకరాలకు నీరిచ్చేందుకు మున్నేరుపై 1.2 టీఎంసీలతో బ్యారేజీ.

* మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం.

ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం ఏదులచెరువు గ్రామం వద్ద ఆకేరు నదిపై బ్యారేజీ నిర్మించి 1.3 టీఎంసీల వినియోగంతో 13,129 ఎకరాలకు నీటిసరఫరా. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కొనసాగింపుగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం వద్ద నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ రోజుకు ఒక టీఎంసీ చొప్పున మళ్లించి 35 టీఎంసీల వినియోగంతో 3.99 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిసరఫరా. క హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటి అవసరాలకు 3 రిజర్వాయర్ల నిర్మాణం. దేవులమ్మనగరం, దండుమల్లారం వద్ద పదేసి టీఎంసీల చొప్పున, ఆరుట్ల వద్ద 5 లేదా 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లకు డీపీఆర్‌ తయారీ.

Read More

అగ్రి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 18 వరకు గడువు పొడిగింపు

2025-26 విద్యా సంవత్సరానికి ఆచార్య ఎన్‌. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ, ఎంబీఏ (ఎస్‌ఎఫ్‌క్యూ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.వి. రమణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించి, హార్డ్‌ కాపీని ఈ నెల 22 లోపు లాంలోని వర్సిటీ పరిపాలన భవనంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు గీగీగీ.బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్‌సైట్‌ను చూడాలని చెప్పారు.

Read More

4 వేల మంది సాగుదారులకు కొత్తగా భూపట్టాలు

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలివ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ సి. సువర్ణ, నల్గొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”భూభారతి పైలట్‌ ప్రాజెక్టులో తిరుమలగిరి (సాగర్‌) మండలంలో 23 వేల ఎకరాల్లో సర్వే చేపట్టాం. 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. దీనిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నాయి. మిగిలిన 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. 3,069 మంది పేరుతో 2,936 ఎకరాలకు బోగస్‌ పాసుపుస్తకాలు ఉన్నట్లు గుర్తించి రద్దు చేశాం. వీటికి రైతుభరోసా, రైతు బీమా కూడా రద్దు చేశాం. 7 వేల ఎకరాల అటవీ భూమి గుర్తించాం. పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ, అటవీ శాఖలు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి” అని మంత్రి ఆదేశించారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More

యూరియా వాడకం తగ్గించిన రైతులకు రూ. 800 లు ప్రోత్సాహం

రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని, యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెప్పారు. సచివాలయంలో సోమవారం జీఎస్‌ డీపీపై జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘యూరియా విక్రయాలను సరిగా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. ప్రభుత్వంలో అన్ని శాఖలనూ ప్రక్షాళన చేశాం. ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం. అందుకే సమస్య వచ్చింది’ అని పేర్కొన్నారు. ‘రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ-క్రాప్‌ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి. అవసరమైతే ఆధార్‌ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దాం’ అని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్దేశించారు.

Read More