- దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం
- ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ విజయవంతం
- సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ విజన్తో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ
- ఆయిల్పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
- త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల
నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీతో ఆయిల్పామ్ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్ఫెడ్ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లాంగ్ విజన్తో నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్పామ్ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.



