ఆంధ్రప్రదేశ్‌కు 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం

ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని.. ఎవరూ అందోళన పడొద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వివరించారు. యూరియా కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లోని రైతులకు వెంటనే దీన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 6న గంగవరం పోర్టుకు 15,000 టన్నులు, సెప్టెంబరు రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30,000 టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.10 లక్షల టన్నుల బఫర్‌ నిల్వలు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Read More

అమెరికాలో జొన్న ఉత్పత్తి హెక్టారుకు 11 టన్నులు

మన దేశంలో దాణా కొరత పశుసంపద వృద్ధికి విఘాతంగా మారిందని, విధానపరమైన సమగ్ర కార్యాచరణ లేకపోవడం వల్లే పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలు ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని భారత సమ్మిళిత పశుదాణా తయారీదారుల సంఘం (సీఎల్‌ఎఫ్‌ఎంఏ) అధ్యకక్షుడు దివ్యకుమార్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జొన్న హెక్టార్‌కు 11 టన్నులు పండుతుంటే మన దేశంలో కేవలం 3 టన్నులే ఉందని.. అక్కడ జన్యుమార్పిడి విత్తనాల వినియోగం వల్ల ఉత్పత్తి పెరుగుతోందని మనదేశంలో దానిని చేపట్టడం లేదని, దేశంలో దాణా అవసరాల దృష్ట్యా పలు పంటల ఉత్పాదకతను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆ రంగాలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం 66వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పశుసంపద, దాణా ఉత్పత్తి ఇతర అంశాల గురించి వివరించారు.
దాణా అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.
మన దేశం పశుసంపదకు నిలయం. వ్యవసాయ జీడీపీలో మూడో వంతు వాటా పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలదే. దేశంలో ఏటా 60 మిలియన్‌ టన్నుల దాణాను వాడుతున్నాం. అందులో 22 మిలియన్‌ టన్నులు మొక్కజొన్నలే. ప్రస్తుతం దేశీయ దాణా అవసరాల్లో సగం మాత్రమే దేశం ఉత్పత్తి చేస్తున్నందున ఇతర దేశాల నుంచి 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది పాడి, పౌల్ట్రీ, మత్స్య రైతులకు, ఉత్పత్తిదారులకు భారంగా మారుతోంది.
ఉత్పాదకతనైనా పెంచాలి
వరి లాంటి పంటలు అవసరానికి మించి సాగవుతున్నాయి, కానీ దాణా అవసరాల దృష్ట్యా మొక్కజొన్న, సోయా, నూనెగింజల విస్తీర్ణం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఆ మేరకు కృషి జరగడం లేదు. జొన్న, సోయా వంటి పంటలను ఎంత పండించినా కొనుగోలుకు ఆస్కారం ఉంది. విస్తీర్ణం పెంచకపోయినా ఉత్పాదకతను పెంచాలని అభ్యర్థిస్తున్నాం. అమెరికాలో మాదిరిగా జన్యుమార్పిడి వద్దనుకుంటే ఉత్పత్తిని పెంచే కొత్త వంగడాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి దృష్టి సారించాలని కోరారు.

Read More

దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ

కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్‌ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్‌ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.

75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

Read More

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉజ్వల భవిత

వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.

Read More

నెల రోజులపాటు పాలేకర్‌ సాగు విధానంపై అవగాహన

సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్పీకే) విధానంలో పంటలు సాగు చేయాలనే ఔత్సాహికులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయనున్నట్లు సేవ్‌ సంస్థ ప్రతినిధి విజయరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి నలుగురు ప్రతి నిధులు సెప్టెంబరు 2న హైదరాబాద్‌ దోమలగూడలోని శ్రీరామచంద్రమిషన్‌లో ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు, యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు వంటి వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

Read More

26న విజయవాడలో ప్రపంచ రికార్డు లక్ష్యంగా.. మట్టి గణపతుల తయారీ

ఈ నెల 26న విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మైదానం, పలు పాఠశాలల వేదికగా పర్యావరణహిత గణపతి విగ్రహాలను వేల సంఖ్యలో ఒకేసారి తయారుచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ వెల్లడించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆవిష్కరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇళ్ల వద్దే పర్యావరణహితంగా ప్రతిమలను తయారుచేసి వాటి ఫొటోలను 9154970454 నంబరుకు వాట్సప్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Read More

పరిశ్రమలా వ్యవసాయాన్ని మలచుకోవాలి

వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి దోహదపడే డైనమిక్‌ పరిశ్రమగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) దక్షిణ భారత వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డా. రంగయ్య వి. సెట్లెం కోరారు. అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గురువారం బేగంపేటలోని గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో అగ్రిబ్రిజ్‌ కనెక్ట్‌ -2025 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డా. రాజిరెడ్డి, కేపీఎంజీ ఇండియా భాగస్వామి, సీనియర్‌ అడ్వైజర్‌ గోపీనాథ్‌ కోనేటి, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, అసోచామ్‌ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్‌ దినేష్‌బాబు, వ్యవసాయ పరిశ్రమలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 పెరిగిన మిరప ధర

గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి మిరప విత్తన వ్యాపారం పడిపోయింది. నారు పోసే పరిస్థితి కానరాక నర్సరీలూ వెలవెలబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల్లోనూ సాగు భారీగా తగ్గనుంది. దీంతో వ్యాపారుల మాయాజాలం మొదలైంది. రేట్లు కాస్త కదిలిస్తే పెరిగిన మిరప ధరలతో రైతుల్లో ఆశ మొదలవుతుందని, మళ్లీ ముమ్మరంగా సాగుకు సిద్ధమవుతారని భావించారు. ఈ మూడు రోజుల్లోనే ధరలు క్వింటాలు రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగాయి. కిందటి నెలతో పోలిస్తే సగటున రూ.2వేలు ధర పెరిగింది. ఏసీలో నిల్వ ఉంచిన మిరపకాయలకు రకాల వారీగా రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నారు. గుంటూరు మార్కెట్లో రోజూ 50 వేలకు పైగా బస్తాల అమ్మకం జరుగుతోంది. *ధర ఇప్పుడే పెరగటానికి కారణాలు ఏమిటి?* వాస్తవానికి గుంటూరు పరిధిలోని శీతల గోదాముల్లోనే సుమారు 40 లక్షల బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా. అయినా రైతులు అమ్మకానికి రావడం లేదు. దీంతో వ్యాపారులు ధరల్ని కొంతమేర పెంచుతున్నారు. సీజన్‌ కావడంతో పాటు నాణ్యమైన సరుకు అమ్మకానికి రాకపోవడంతోనే కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Read More

భద్రాద్రిలో జిల్లాకు మునగ సాగులో జాతీయ స్థాయి గుర్తింపు

రైతు ఆదాయం పెంపు లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంతో జాతీయ స్థాయిలో భద్రాద్రి జిల్లాకు గుర్తింపు లభించింది. భద్రాద్రి జిల్లా రైతులు మునగ సాగులో సాధించిన సత్ఫలితాలను ‘లక్ష్యసాధన జిల్లాలు'(యాస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌) అనే పేరుతో నీతిఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రత్యేకంగా వివరించింది. దాదాపు 50 శాతం అటవీ భూభాగమున్న ఈ జిల్లా జనాభాలో 37 శాతం గిరిజనులే. భారీ వర్షపాతం నమోదవుతున్నా సాగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేవు. అధిక పెట్టుబడి వ్యయంతో పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నా ఫలితం ఉండట్లేదు. పోషకాహారలేమి వల్ల జిల్లా ప్రజలు రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతుల ఆదాయం పెంచేందుకు ప్రయోగాత్మకంగా 415 ఎకరాల్లో మునగ పంటను సాగు చేయించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్శిటీ సహకారంతో అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పంట సాగుపై రైతులకు మెలకువలు నేర్పారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లా యంత్రాంగం సహకారం అందించింది. మునగ మొక్కల సాగుతో రైతులకు మంచి ఆదాయం వచ్చింది. అంతర పంటలుగా కూరగాయల సాగుతో కూడా ఆదాయం సమకూరింది. మునగ ఆకులను కూరలుగా తినడంతోపాటు పశువులకు దాణాగా కూడా ఇచ్చారు. ఈ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందిన జమీల్‌ అనే రైతు కోళ్లకు మేతగా మునగాకును వినియోగించి సత్ఫలితాలు సాధించినట్లు తెలిపారని నీతిఆయోగ్‌ వివరించింది. మునగ సాగు వల్ల రైతుల ఆదాయం రెట్టింపు కావడమే కాకుండా.. దేశాన్ని అనీమియా రహిత భారత్‌గా మార్చేందుకు ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.

Read More

పంటలకు సమృద్ధిగా సాగునీరు: మంత్రి ఉత్తమ్‌

వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వలన తెలంగాణాలో ప్రాజెక్టులు నిండటంతో వానాకాలం పంటలకు సమృద్ధిగా సాగునీటిని అందించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 388 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని, చివరి ఎకరా వరకు ఆటంకం లేకుండా సాగునీరు సరఫరా చేసేలా జిల్లా స్థాయి అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో సచివాలయం నుంచి సీఈలు, ఎస్‌ఈలు ఇతర ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జూరాల, శ్రీశైలం, సాగర్లకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరుకు వరద వస్తోంది. రాష్ట్రంలో 34,740 చెరువులకు 12,023 నిండగా, మరో 9,100 చెరువులు 75-100 శాతం నిండాయి. వరదలకు 177 చెరువులు, కాలువలు, లిఫ్టులు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు రూ.355 కోట్లతో అంచనాలు సిద్ధం చేశాం. ఇప్పటికే 3,500 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం’ అని, యాసంగి పంటలకు కూడా సాగునీటి ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు.

Read More