వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలి

వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో సంపన్న దేశాలు, వర్థమాన దేశాల మధ్య సత్వరం అంగీకారం కుదరకపోతే సమయం మించిపోతుందని 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 30) సభ అధ్యక్షుడు ఆందే కొరియా డు లాగో సోమవారం హెచ్చరించారు. వాతావరణ మార్పుల నిరోధం గురించి చర్చించడానికి, ప్రపంచ దేశాలతో సమన్వయం నెరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్బన ఉద్గార రహిత అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు చేయూతనివ్వాలని వర్ధమాన దేశాలు కోరుతుంటే.. సంపన్న దేశాలు దానికి నిరాకరించడమే కాకుండా వర్ధమాన దేశాలు తమ పాట్లు తాము పడాలన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాలుష్య కారక శిలాజ ఇంధనాల స్థానంలో జీవ ఇంధనాల వినియోగాన్ని బ్రెజిల్, భారత్లో పెద్ద ఎత్తున చేపట్టాయని వివరించారు. అయితే ఇది ఖరీదైన పరిష్కారమార్గం కాబట్టి.. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు.

Read More

ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.

Read More

వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థకు పూర్వ వైభవం తేవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ ప్రస్తుత పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించి సంస్థకు పూర్వవైభవం తెస్తామని వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. సోమవారం ఆయన మలక్ పేటలోని ఆ సంస్థను తమ సభ్యులతో కలిసి సందర్శించారు.

Read More

వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర

PJTAU పరిధిలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈరోజు 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు గుర్తింపు పత్రాలని ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అందజేశారు. ఈ సంస్థలు PJTAU అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో విజయవంతంగా సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నాయి. అగ్రి హబ్ తరఫున ఇప్పటికి సుమారు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో తోడ్పాటు నందించామని జానయ్య వివరించారు. ఇందులో భాగంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయం తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించిన రోబో ని అల్దాస్ జానయ్య ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనందించే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు. అంతేకాకుండా మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి 40 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం PJTAU అగ్రి హబ్ ద్వారా అందజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని అల్థాస్ జానయ్య అన్నారు. ఆ వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపద మూలాలు ఈనాటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నాబార్డ్ DGM దీప్తి, WE HUB ప్రతినిధి సీత, PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, AG HUB MD G. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సౌర విద్యుత్తు

ఆంధ్రప్రదేశ్‌ పీఎం కుసుమ్‌ పథకం రెండో థను 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. దీని ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపారు. పథకం అమలు కోసం ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెండోథ ప్రాజెక్టును 2026 నుంచి కేంద్రం అమలుచేయనుంది. వాటి ద్వారా 2027-28 నుంచి సుమారు 2,000 మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని అంచనా. 19 శాతం కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌ (సీయూఎఫ్‌)గా అధికారులు పరిగణించారు. ఈ లెక్కన సుమారు 3,200 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ ఉత్పత్తి వస్తుందని అంచనా. అప్పటికి యూనిట్‌ విద్యుత్‌ వ్యయం ఆధారంగా లెక్కిస్తే.. ఏటా సుమారు రూ. 254.04 కోట్లు విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో ఆదా అవుతుందని అధికారుల అంచనా. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అమలులో ఉండే 25 ఏళ్లలో సుమారు రూ.6,351 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు.
మూడోవంతు కనెక్షన్లకు సౌర విద్యుత్‌

  • ఆంధ్రరాష్ట్రంలో 21 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో పీఎం కుసుమ్‌ కింద మొదటిథలో 3 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేందుకు కేంద్రం అనుమతించింది. రెండోథలో ప్రతిపాదించిన 4 లక్షలతో కలిపి.. మొత్తంగా 7 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేలా ప్రభుత్వం ప్రాజెక్టు రూపొందించింది.
  • ఏటా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం రాయితీ కింద సుమారు రూ.8వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోంది. మొత్తం వ్యవసాయ కనెక్షన్లలో మూడోవంతు వాటికి సౌర విద్యుత్‌ అందించడం వల్ల ఆ మేరకు ప్రభుత్వం ఏటా చెల్లించే రాయితీ మొత్తంలో
    మిగులుతుంది.
  • ఫీడర్‌ స్థాయిలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు మహారాష్ట్రలో అమలవుతున్న విధానాన్ని అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అందుకు మెరుగైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
    మొదటి థలో రూ.2,035 కోట్లు ఆదా
    పీఎం కుసుమ్‌ మొదటి థలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇప్పటికే టెండరు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గుత్తేదారుల నుంచి 50 బిడ్లు దాఖలయ్యాయి. సంప్రదింపుల తర్వాత యూనిట్‌ తక్కువ ధరకు ఇచ్చేందుకు అంగీకరించిన గుత్తేదారులకు అధికారులు ఎల్‌వోఏ ఇచ్చారు.
  • మూడు డిస్కంల పరిధిలో కలిపి యూనిట్‌కు సగటున రూ.3.17 చొప్పున గుత్తేదారులు కోట్‌ చేశారు. ప్రస్తుతం ఆ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ పథకం కింద ప్రభుత్వం రాయితీగా చెల్లించే మొత్తంతో పోలిస్తే మినీ సౌర ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్‌ తీసుకోవడం వల్ల ఏటా రూ.81 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కించారు.
  • పీపీఏ వ్యవధిలో 25 ఏళ్లలో రూ.2,035 కోట్లు ఆదా అవుతుందని అంచనా. మూడు డిస్కంలలో కలిపి 1,162.80 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.
Read More

వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల (సెప్టెంబర్‌) 3, 4, 8, 9, 10 తేదీల్లో రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్‌ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సి.హెచ్‌. విద్యాసాగర్‌ ప్రకటించారు. రాజేంద్రనగర్‌ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈనెల 3, 4, 8, 9, 10 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఈ రెండవ విడత కౌన్సిలింగ్‌ జరగనుందని ఆయన తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించవచ్చని డాక్టర్‌ విద్యాసాగర్‌ సూచించారు.

Read More

మార్కెట్‌ యార్డుల్లో వినియోగం కంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లు

తెలంగాణా రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సౌరవిద్యుత్‌ సంస్థ ద్వారా దీనిని అమలు చేయనుంది. తొలిథలో పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌, నిజామాబాద్‌, గద్వాల, సూర్యాపేట మార్కెట్‌ యార్డులను ఎంపిక చేసింది. శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధికారులు ఈ వారంలోనే ఆయా యార్డులను సందర్శించి ముందుగా ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తిస్తారు. ఆయా యార్డుల్లో విద్యుత్‌ వినియోగాన్ని గుర్తించి దానికంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. యార్డు అవసరాలు పోనూ మిగిలిన విద్యుత్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు విక్రయించనున్నారు.

Read More

సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపైసర్టిఫికేషన్‌ కోర్సు

మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్‌ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్‌ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉల్లి రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలి

ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్‌ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్‌ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్‌ చైన్‌ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

Read More

ఆగస్టు 30న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులకి వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌

ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌, బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) కోర్సులలో సీట్ల భర్తీకి వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ ప్రకటించారు. అదేరోజు అనగా 30వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్‌ డిగ్రీ కోర్సు బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల కోసం వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని రిజిస్ట్రార్‌ తెలిపారు. రాజేంద్రనగర్‌ లోని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ రెండు కౌన్సెలింగ్‌ లు నిర్వహించనున్నట్లు డాక్టర్‌ విద్యాసాగర్‌ వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధృవపత్రాలు మరియు వెబ్‌ సైట్‌ లో సూచించిన రుసుమును తీసుకొని కౌన్సిలింగ్‌ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించగలరని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు.

Read More