ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌, బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) కోర్సులలో సీట్ల భర్తీకి వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ ప్రకటించారు. అదేరోజు అనగా 30వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్‌ డిగ్రీ కోర్సు బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల కోసం వాక్‌ ఇన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని రిజిస్ట్రార్‌ తెలిపారు. రాజేంద్రనగర్‌ లోని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ రెండు కౌన్సెలింగ్‌ లు నిర్వహించనున్నట్లు డాక్టర్‌ విద్యాసాగర్‌ వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధృవపత్రాలు మరియు వెబ్‌ సైట్‌ లో సూచించిన రుసుమును తీసుకొని కౌన్సిలింగ్‌ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించగలరని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు.