ఈ నెల 26న విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మైదానం, పలు పాఠశాలల వేదికగా పర్యావరణహిత గణపతి విగ్రహాలను వేల సంఖ్యలో ఒకేసారి తయారుచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ వెల్లడించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆవిష్కరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇళ్ల వద్దే పర్యావరణహితంగా ప్రతిమలను తయారుచేసి వాటి ఫొటోలను 9154970454 నంబరుకు వాట్సప్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.