ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా పసుపు సాగు చేయండి: మంత్రి తుమ్మల

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మలను పసుపు బోర్డ్‌ సెక్రెటరీ శ్రీమతి ఎన్‌. భవానీ శ్రీ కలిసి కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషర్స్‌, గ్రైండర్లు వంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు సెక్రటరీ తెలిపారు. అలాగే పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి 23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను, యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌లో తోడ్పాటునందిస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం పసుపును పౌడర్‌ రూపంలో ఐటిసి, పతంజలి వంటి వివిధ కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు, మధ్యమ దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ కూడా నిజామాబాద్‌లో స్థాపించడానికి ముందుకు వచ్చిందని మంత్రికి తెలియచేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కుర్క్‌ మిన్‌ పసుపులో అధికంగా వచ్చే నూతన రకాల సాగు, పురుగు, కలుపు రకాల వినియోగం తగ్గించడం ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడం, ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా మరియు ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్‌ లింకేజీలు కల్పించాలని కోరారు. ఆదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేశారు.

Read More

తెలంగాణలో 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతి

తెలంగాణలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శివారు మగ్దుంనగర్‌, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం అప్పాయిపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుత (2025-26) విద్యా సంవత్సరంలో 30 నుంచి 60 సీట్లతో వీటిని ప్రారంభించాలని, ఆ తర్వాత సంవత్సరం నుంచి సీట్ల సంఖ్యను 120కు పెంచాలని సూచించింది. ఈ మూడు కళాశాలల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

Read More

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు తక్కువగా ఉన్నందున.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో 12 మార్కెట్‌ యార్డులు కాగా.. మిగిలినవి జిన్నింగ్‌ మిల్లులు. ఈ సీజన్‌లో క్వింటా పత్తి మద్దతు ధర రూ. 8,110గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్రంలో 4,56,107 హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. 8 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పత్తి సేకరణలో భాగస్వాములయ్యే అధికారులందరికీ బుధవారం గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ సందేహాల నివృత్తికి కాల్‌ సెంటర్‌ 76599 54529 నంబరులో సంప్రదించాలని అధికారులు కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇథనాల్‌ పరిశ్రమ

తిరుపతి జిల్లా కోనేటిరాజుపాళెం సమీపంలో ఎమ్మెస్‌ నయారా ఎనర్జీ లిమిటెడ్‌ గ్రేస్‌ డిస్టిలరీ కంపెనీ. రూ.581.88 కోట్లతో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 13న ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు. పారిశ్రామిక వాడలో ఇది రెండో ఇథనాల్‌ పరిశ్రమ కానుంది. పెట్రోలుపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఈ-20 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. స్థానికంగా ఉన్న వరి, జొన్న, సజ్జ, గోధుమలు, చెరకు పిప్పి ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసి 50 శాతం పెట్రోలు భారం తగ్గించాలన్నదే కేంద్రం లక్ష్యంగా మారింది.

Read More

జాతీయ నమూనాగా రాజస్థాన్‌లోని గోశాల

ఆవుల సంరక్షణ కోసం 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సంరక్షణ యూనిట్‌ను రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ లోని హింగోనియా గోశాలలో ప్రారంభించారు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు ఇక్కడ చికిత్స చేస్తారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పశువైద్య భవనం కూడా నిర్మితమవుతోంది. ఈ పునరావాస కేంద్రంలో సుమారు 18,000 పశువులు సంరక్షణ పొందవచ్చు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కొన్ని వందల పశువులను జైపుర్‌ మున్సిపల్‌ కార్పొరేషను సిబ్బంది, జంతు ప్రేమికులు ప్రతిరోజూ ఈ కేంద్రానికి తీసుకువస్తారు. హింగోనియాను దేశంలో గోసేవకు ఆదర్శవంతమైన నమూనాగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పునరావాస కేంద్రం మేనేజరు ప్రేమ్‌ ఆనంద్‌ తెలిపారు.

Read More

రేపటి నుండి సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించిన ”రైతు నేస్తం” కార్యక్రమంలో పాల్గొని, ఈ యాసంగి సీజన్‌లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం మరియు ఎన్‌ఎంఇఓ పథకాల ద్వారా 50% రాయితీతో ఇవ్వనున్న శనగ, ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమ పంటల విత్తనాలను రైతులకు అందజేసారు. రేపటి నుండి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి మరియు రైతునేస్తం వేంకటేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Read More

నూనెగింజలు, ఆయిల్‌పామ్‌ పంటలే లాభదాయకం

తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ పామ్‌ కెనెల్‌ ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు

క్రూడ్‌ పామ్‌ కెనెల్‌ ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ ఏలూరు జిల్లాలో రూ.209. 77 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్‌ ఆగ్రో వెట్‌ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌ మొదటి దశను 2026 మార్చి నాటికి, 2029 మార్చి నాటికి రెండో దశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Read More

మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, హాకా, ఆర్‌ఐసి సంస్థల ఎండీలతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణా రాష్ట్రంలో వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మరియు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు, మున్నగు వాటి జిల్లాల వారి లభ్యతపై సమీక్షించారు.
మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, ఐనప్పటికి రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రేపటి నుండి మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిసిఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. కావున వెంటనే కలెక్టర్లు జిన్నింగ్‌ సెంటర్లు రేపటిలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌ఓడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఎండి, వేర్‌ హౌజ్‌, వరంగల్‌ జిల్లాకు డైరెక్టర్‌, హార్టీకల్చర్‌, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్‌, అగ్రికల్చర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఎండి, హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్‌ మార్కెటింగ్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు డైరెక్టర్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌, కరీంనగర్‌ జిల్లాకు ఎండి, ఆగ్రోస్‌, మెదక్‌ జిల్లాకు ఎండి, మార్క్‌ ఫెడ్‌, రంగారెడ్డి జిల్లాకు ఎండి, ఆయిల్‌ ఫెడ్‌ గార్ల స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, హాకా ఎండీ చంథ్రేఖర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More

ప్రాణహితపై నిర్మించనున్న ‘తుమ్మిడిహెట్టి’ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై దృష్టి పెట్టండి

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రాణహితపై నిర్మించ నున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదా సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపునకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపకల్పనపై దృష్టి సారించాలని ఇంజినీర్లను తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి ఆదేశించారు. ‘బ్యారేజీ నుంచి 71 కిలోమీటర్ల వరకు గతంలోనే కాలువ తవ్వకం పూర్తయింది. అక్కడి నుంచి ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు నిర్మించాల్సిన కాలువపై నిర్ణయం జరగాల్సి ఉంది. వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం జరుగుతుంది. బ్యారేజీ ఎక్కడ నిర్మించాలనేది సాంకేతిక పరీక్ష తర్వాత ఖరారవుతుంది. నీటిని తరలించే మార్గాన్ని ఖరారు చేసేందుకు ఏదైనా ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలా.. లేదంటే ఇంజినీర్లే చేస్తారా.. అనేది స్పష్టత ఇవ్వండి’ అని పేర్కొన్నట్లు తెలిసింది. టెండరు ద్వారా ఏజెన్సీకి అప్పగించాలన్న చర్చ జరగ్గా.. మంచిర్యాల యూనిట్‌ ద్వారా పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎల్లంపల్లి లేదా సుందిళ్లకు కాలువ నిర్మాణానికి సంబంధించిన అంచనాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

Read More