నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ

  • ఎర్త్‌ సమ్మిట్‌ స్టార్టప్స్‌కు బాటలు వేయాలి
  • రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు ధన్యవాదాలు
  • ఎర్త్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌ ఎడిషన్‌ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారంనాడు హైదరాబాద్‌ హైటెక్స్‌లో నాబార్డ్‌ మరియు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల ఎర్త్‌ సమ్మిట్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు, గ్రామీణ భారతదేశంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న నాబార్డ్‌ సేవలు అభినందనీయమన్నారు.

వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌కు సమ్మిట్‌ బాటలు వేయాలనీ సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నామనీ ఎఫ్‌.పీ.ఓ లు స్టార్టప్స్‌ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలి, అందుకోసం మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌తోపాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు మంత్రి తుమ్మల.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు పాలనా సంస్కరణలతోనే సాధ్యమని, భారత రైతాంగానికి మరియు నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నాబార్డ్‌ చేపట్టిన ఎర్త్‌ సమ్మిట్‌కు ప్రభుత్వపక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల.

ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ షాజీ కేవీ డిప్యూటీ ఎండీ గోవర్ధన్‌ సింగ్‌ రావత్‌ మరియు డి. ఎండీ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ పాల్గొన్నారు.

Read More

రేపే రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు

రైతుల ఖాతాల్లోకి కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేల చొప్పున పీఎం కిసాన్‌-అన్న దాతా సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్‌- అన్నదాతా సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా రూ.3,174 కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతల్లో కలిపి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ ఎస్‌ కే) ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ‘రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా.. వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలి. అగ్రిటెక్‌, డిమాండ్‌ ఉన్న పంటల సాగు, మార్కెట్‌ సౌకర్యాల పెంపు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఆహారశుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగా హన కల్పించాలి’ అని సూచించారు. నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్‌లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రైతుల సందేహాల నివృత్తికి టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలి. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్‌ మ్యుటేషన్‌ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తాం” అని అచ్చెన్నాయుడు చెప్పారు.

Read More

వరి కంకులతో ఉపాధి

గుమ్మాలకు కట్టుకోవడంతోపాటు శుభకార్యాల్లో అలంకరణగా, బహుమతులుగా ఇచ్చేందుకు ధాన్యం కుచ్చులు తయారు చేసి విక్రయించడాన్ని ఉపాధిగా మలిచారు నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీవో) విజయలక్ష్మి. మూడేళ్ల క్రితం 50 కుచ్చులతో ప్రారంభించి, గతేడాది 400 వరకు వాటిని తయారుచేసి విక్రయించారు. ఈ ఏడాది గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు వెయ్యికిపైగా కుచ్చుల తయారీకి నిర్ణయించారు. కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే దొడ్డురకం వరిని కోసుకొచ్చి.. ఒక్కో కర్రను తీసుకుని.. అందులో ధాన్యం కలిగిన దాని వెన్నును తీస్తారు. అలా తీసిన వెన్నును దారంకు అల్లుతారు. ఇలా కుచ్చును తీర్చిదిద్ది ఒక్కో దానిని రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు.

Read More

అనిశ్చిత వాతావరణం కారణంగా దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

మొంథా తుపాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా తెలంగాణలో పత్తి, సోయా బీన్‌, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని, తీవ్రంగా దెబ్బతిన్న మూడు పంటల కొనుగోళ్లపై ప్రత్యేక సడలింపులివ్వాలని, లక్షల మంది రైతులకు ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌లకు గురువారం లేఖలు రాశారు. ”మొంథా తుపాను వల్ల పత్తి పంట దెబ్బతింది. రైతులు నష్టపోకుండా సీసీఐ తేమ శాతం 20కి పెంచి కొనేలా ఆదేశాలివ్వాలి. ఎకరానికి 11.74 క్వింటాళ్ల మేరకు పత్తి రాష్ట్రంలో పండగా.. సీసీఐ 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధన తేవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ వేయగా.. వర్షాల వల్ల పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. నాఫెడ్‌ ద్వారా నాణ్యత ప్రమాణాలు సడలించి కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో 6.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించగా… మార్కెట్లో ధర క్వింటాకు రూ.1,959కి పడిపోయింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 రావడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటివరకు 14,519 మంది రైతుల నుంచి 48,757 టన్నులను కొన్నది. మొత్తం పంట కొనేందుకు కేంద్రమే చొరవచూపాలి” అని తుమ్మల కోరారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది

తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.* తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆంధ్రరాష్ట్రంలోని వ్యవసాయరంగ పరిస్థితులను కేంద్రమంత్రికి వివరించిన చంద్రబాబు నాయుడు

2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (పీఎంఆర్కేవీవై), పీడీఎంసీ పథకాల కింద రాష్ట్రానికి రూ. 695 కోట్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వాటర్‌షెడ్‌ మహోత్సవంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన చౌహాన్‌.. చంద్రబాబు ఆహ్వానం మేరకు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. వారిద్దరూ సుమారు గంటసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, మైనర్‌ ఇరిగేషన్‌ వంటి అంశాలపై చర్చ జరిగింది. మొంథా తుపాను వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మైనర్‌ ఇరిగేషన్‌ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. తోతాపురి మామిడి రైతులకు మార్కెట్‌ జోక్యం కింద ఇచ్చిన మద్దతు ధరలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.100 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read More

ఈనెల 13 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ ఆక్వాకల్చర్‌ సదస్సు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌ సదస్సు-2025 సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆక్వాకల్చర్‌ సొసైటీ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ అభివృద్ధి మండలి, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు నిర్వహించే ఈ సదస్సులో 20కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచ జనాభాకు అనుగుణంగా మత్స్యరంగం, ఆక్వాకల్చర్‌ విస్తరణ లక్ష్యంతో నిర్వహించే ఈ సదస్సులో ‘దేశంలో నీలి విప్లవంతో ఆక్వా ఎగుమతుల వృద్ధి’ అంశంపై మంగళవారం నుంచి 13వ తేదీ వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి.

Read More

పత్తి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరగాలి

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు మొత్తం 321కి గాను సోమవారం వరకు 251 కేంద్రాలే ఏర్పాటు కావడంతో అరకొరగా కొనుగోళ్లు జరుగుతాయని, మరో 70 కేంద్రాలు ఏర్పాటు చేయిస్తేనే పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నివేదిక అందజేసింది. 45.32 లక్షల ఎకరాల్లో 28.29లక్షల టన్నుల పత్తి పండగా.. సోమవారం వరకు 36,567.38 టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. మొత్తం 42 లక్షల మంది రైతుల్లో 19,922 మంది మాత్రమే పత్తిని విక్రయించారని పేర్కొంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా 129 కేంద్రాల్లో 12,025 మంది రైతుల నుంచి 38,648.90 టన్నుల మొక్కజొన్న. 38 కేంద్రాల్లో 1,884మంది రైతుల నుంచి 3,438 టన్నుల సోయాబీన్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Read More

ప్రధాన మంత్రి పంటల బీమా పథకంకు రూ.44.06 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.44.06 కోట్లు రబీలో ప్రధాన మంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) అమలుకు విడుదల చేసింది. అడ్వాన్స్‌ ప్రీమియం కింద రాష్ట్ర వాటాగా ఈ మొత్తాన్ని ఎస్క్రోఖాతాలో డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

మామిడికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు

మామిడి సాగులో రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా పామాయిల్పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలం ఇష్టంతో పెంచుకున్న తోటలను నిలువునా నరికేస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్కు గిరాకీ నేపథ్యంలో, మామిడి నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు తర్వాత అత్యధికంగా మామిడి సాగుకు మైలవరం నియోజకవర్గం పేరుగాంచింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల పరిధిలో ఐదారు దశాబ్దాల కిందటి నుంచి సాగు చేస్తున్న రైతులను మోతుబరులను చేసింది. రారాజుగా, అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంటగా ఘనత దక్కించుకున్న మామిడి నేడు రైతులను నిరాశలో ముంచెత్తుతోంది. గడిచిన నాలుగైదేళ్లుగా సగానికిపైగా మామిడి సాగు రైతులు కనీస ఆదాయాన్ని చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఏయేటికాయేడు అనుకూల పరిస్థితుల కోసం ఆశగా ఎదురుచూసినా, ఈ ఏడాది ఎదురైన ప్రతికూల పరిస్థితులు వారి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాయి. నాలుగైదేళ్లు కిందటి వరకు గోదావరి జిల్లాలకే పరిమితమైన పామాయిల్ సాగు క్రమేపీ ఎన్టీఆర్ జిల్లాకు ప్రవేశించింది. ప్రభుత్వ మద్దతు ధర ఉండడంతో పాటు, కరోనా సమయంలో, మద్దతు ధర కంటే రెట్టింపు ధరలు పలకడంతో రైతుల్లో ఈ సాగుపై మక్కువ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను ఉచితంగా ఇవ్వడమే గాక, అంతర పంటలకు ప్రోత్సాహం, రాయితీపై బిందు సేద్య పరికరాలు, ఉపాధిహామీ పథకానికి అనుసంధానించడంతో రైతుల్లో పామాయిల్ సాగుపై మరింత ఆసక్తి పెరిగింది.

Read More