తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.* తెలంగాణలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్‌-2025 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రూ. 123 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం. దీని కింద 26 వేల నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేస్తున్నాం. ఉచిత పంపిణీ పథకానికి ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేస్తున్నాం. సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని 5 లక్షల మంది మత్స్యకారులకు రూ.1.40 లక్షలతో బీమా పథకం చేపట్టాం’ అని, మధ్యాహ్న భోజనం పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. చేపల పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌, రాష్ట్ర సంచాలకురాలు నిఖిల, ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జాయ్‌కృష్ణ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈవో బిజయ్‌కుమార్‌ బెహెరా, పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, రాష్ట్ర మత్స్యసహకార సంస్థ ఛైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.