తేనెటీగల విషంలో ఔషధ గుణాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలోని సమీకృత తేనెటీగల పెంపక కేంద్రంలో తేనెటీగల నుంచి విషాన్ని సేకరిస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌ కలిగిన బీ వీనం కలెక్టర్‌ (బీవీసీ) అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తేనెటీగల పెట్టె ప్రవేశద్వారం చెంత అమర్చారు. పెట్టె వద్ద తేనెటీగలు రాకపోకలు సాగించేటప్పుడు అవి బీవీసీ కంపార్టుమెంట్‌పై వాలగానే ఎలక్ట్రిక్‌ వైబ్రేషన్‌కు గురై వాటికున్న స్టింగ్‌ల ద్వారా విషపూరిత స్రావాన్ని విడుదల చేస్తున్నాయి. ఆ స్రావాలు కంపార్టుమెంటులోని అద్దంపై మైనంలా ఏర్పడుతున్నాయి. వాటిని సేకరించి గాజుసీసాలో భద్రపరుస్తున్నారు. తేనెటీగలు కుట్టినప్పుడు విడుదల చేసే విషపూరిత స్రావాల్లో వివిధ రసాయనాలుంటాయని, వీటిని చర్మ సమస్యలు, అర్ధరైటిస్‌ వంటి చికిత్సల్లో ఉపయోగిస్తారని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఒక గ్రాము విషాన్ని సేకరించడానికి సుమారుగా 10 వేల నుంచి 15 వేల తేనెటీగలను పరికరంలోకి పంపాల్సి ఉంటుందని చెప్పారు.

Read More

వ్యాధిని బట్టి వెల్లుల్లి రకం

ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లిలోని ఎలిసిన్‌… అంటువ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు.. అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. సెలీనియం క్యాన్సర్‌ కణాలవ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు గుండె ధమనులను కాపాడతాయి. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, వృధ్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లికి ఉన్న ఈ సహజ రోగ నిరోధక లక్షణాలను నానో టెక్నాలజీతో మరింత ఇనుమడింపజేయవచ్చని అలహాబాద్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు కె.ఎన్‌. ఉత్తమ్‌ నిర్ధారించారు. ఆయన ఆధ్వర్యంలో పరిశోధకులు వెల్లుల్లి మొక్కపై టైటానియం డయాక్సైడ్‌ నానో పార్టికిల్స్‌ను ప్రయోగించారు. ఈ నానో అణువులు వెల్లుల్లిలోని పోషక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా వెల్లుల్లిలో గంధకం, భాస్వరం, క్యాల్షియం, జింక్‌, ఇనుము ధాతువులు సాధారణం కన్నా ఎక్కువగా ఏర్పడ్డాయి. యాంటీ ఆక్సిడెంట్లు 30 నుంచి 40 శాతం పెరిగాయి. వెల్లుల్లిలోని ఏ ధాతువు ఏ వ్యాధి చికిత్సకు తోడ్పడుతుందో నిర్ధారించుకుని ఆయా రోగాల చికిత్సకు పరిశోధనశాలలో వేర్వేరు వెల్లుల్లి రకాలను రూపొందించి పొలాల్లో సాగు చేయించాలని ఉత్తమ్‌ బృందం యోచిస్తోంది. ఇలాంటి రకాలకు పేటెంట్లు తీసుకుని రెండేళ్లలో రైతులకు అందించాలనుకుంటున్నమని ఉత్తమ్‌ చెప్పారు.

Read More

తెలంగాణలో వ్యవసాయరంగానికి ఉజ్జ్వల భవిష్యత్తు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం అని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల సమ్మిట్లో ప్రదర్శించాల్సిన ఏవీల కంటెంట్ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబంబించేలా ఏవీలను రూపొందించాలన్నారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జిఎస్ఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలు అని మంత్రి అధికారులకు వివరించారు. ఐఓటి ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్ పరిశోధన, టిఏఆర్ సిసి, గ్లోబల్ సీడ్ లీడర్ షిప్, హార్టీకల్చర్ మెగా క్లస్టర్లు, ఆయిల్ష్పామ్ విస్తరణ, ఫామ్ టూరిజం, ఎఫ్పిఓలను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయడం, పాలు, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రిలాజిస్టిక్స్ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఇవి రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన అగ్రి-ఎగుమతులకు మార్గం సుగమం చేయనున్నాయని, విజన్ 2047 డాక్యుమెంట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశ నిర్దేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని, రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగపరచడంతో పాటు భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇకపై సాంకేతిక-ఆధారిత, డేటా-ఆధారిత, మార్కెట్-ఆధారిత వ్యవసాయ మోడల్ ద్వారా రైతులను మరింత సాధికారులను చేయడం ప్రభుత్వం యొక్క సంకల్పమని స్పష్టం చేశారు.”వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు శ్రమే రాష్ట్ర అభివృద్ధికి మూలం. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ, వ్యవసాయం-సాంకేతికత-పెట్టుబడుల నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య, హార్టీకల్చర్ యూనివర్సిటి విసి రాజిరెట్టి, మార్కెఫెడ్ ఎండి శ్రీనివాస రెడ్డి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి మరియు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More

కోతుల బెడద నివారణకు నోడల్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కోతుల బెడదతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి లోకసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమస్యను అటవీశాఖ దృష్టికి తీసుకెళ్తే మాకేమీ సంబంధంలేదంటున్నారు. అలాగే పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలు కూడా నోడలు ఏజెన్సీలుగా వ్యవహరించడంలేదు. కేంద్రం తక్షణం స్పందించి కోతులు, జింకల నివారణ కోసం ఒక ప్రత్యేక నోడల్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హాస్టళ్లు

యానిమల్ హాస్టల్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. స్థలం.. సమయం లేని వారి పశువులను ఈ హాస్టళ్లల్లో పెట్టి ఆలనాపాలన వారే చూసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రాథమికంగా రాష్ట్రంలో నియోజకవర్గానికో హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో హాస్టల్ అరెకరం స్థలంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఇందులో 20-25 పశువులు పట్టేలా నిర్మాణం చేపడతారు. మిగిలిన స్థలంలో గడ్డి అభివృద్ధి చేస్తారు. నిర్మాణానికి రూ. 10లక్షల నిధులు ఉపాధిహామీ నుంచి విడుదల చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజులు నిర్వహించిన తర్వాత పాడి రైతులంతా సంఘాలుగా ఏర్పడి ఇలాంటి హాస్టళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సొంత స్థలం ఉంటే సరే లేదంటే ప్రభుత్వమే స్థలం సమకూరుస్తుంది. షెడ్డు నిర్మాణానికి సైతంఉపాధి హామీ నుంచి నిధులు సమకూర్చేలా అధికారులు సమాలోచన చేస్తున్నారు. గ్రామాల్లో ఆసక్తి ఉన్నవారు తమ పశువులను అక్కడికి తరలిస్తే వాటికి దాణా, గడ్డి, నీరు అన్నీ నిర్వాహకులు చూసుకుంటారు. ఉదయం సాయంత్రం వెళితే యజమానుల ముందే పాలు పితికి అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహణక అయ్యే ఖర్చు యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.

Read More

ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More

34,196 టన్నుల పంట ఉత్పత్తులు కిసాన్‌ రైళ్ల ద్వారా రవాణా

బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నకు కిసాన్‌ రైల్‌ పథకాన్ని 2020 ఆగస్టు 7న ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 116 సర్వీసుల ద్వారా 34,196 టన్నుల పంట ఉత్పత్తులను రవాణా చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అస్సాం, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, త్రిపురలకు అరటి, మామిడి, ఉల్లితోపాటు మరికొన్ని పంట ఉత్పత్తులు రవాణా చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నడిపిన 2,364 కిసాన్‌ రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నులు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ రైలు సేవల ద్వారా రూ.318.68 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

Read More

యాసంగిలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు

బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివమ్‌) సమావేశం ఈఎన్సీ అంజద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన జరిపి యాసంగి పంట కాలంలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని ఇందులో నిర్ణయించారు. సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.

  • రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల లభ్యత ఉంది. దీన్ని దాదాపు 43 లక్షల ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.
  • ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, నిజాంసాగర్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టుల్లో జూన్‌ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు పోను 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 30.97 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన చేశారు.
  • చిన్నతరహా ప్రాజెక్టుల పరిధిలో 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
  • మధ్యతరహా ప్రాజెక్టుల్లో 28.95 టీఎంసీలు ఉన్నాయి. వీటి ద్వారా 2.78 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
  • 24.61 లక్షల ఎకరాల తరి, 18.45 లక్షల ఎకరాల ఆరుతడి పంటకు నీరు ఇవ్వనున్నారు.
Read More

ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడంపై దృష్టిసారించాలి* : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత, రసాయన ఎరువుల మరియు పురుగుమందుల విచ్చలవిడి వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆసియా పిజిపిఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన మహాకిసాన్‌ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో అన్నారు. రసాయన ఎరువుల వినియోగం తెలంగాణలో గత పదేళ్లలో గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం భారతదేశ వినియోగం, అన్ని రకాల ఎరువులు కలుపుకొని 600 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని, అదేవిధంగా దేశంలో సగటు పురుగుమందులు వినియోగం కంటే కూడా తెలంగాణ వినియోగం అధికంగా ఉందని, కావున మనమిప్పుడు కేవలం ఉత్పత్తి మీదనే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడం మీద దృష్టిసారించాలని హితవు పలికారు.అదేవిధంగా గత 30 సంవత్సరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించారో వివరిస్తూ.. ప్రస్తుతం ఆ పంట సాగుకు గల అవకాశాలు మరియు ఆయిల్‌ పామ్‌ పంటలో వేయగల అంతరపంటల సాగు గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.తరువాత వివిధ జిల్లాల నుండి ఎంపిక చేసిన ఆదర్శరైతులకు రైతురత్న అవార్డులను అందచేశారు. మహాకిసాన్‌ మేళాలో భాగంగా రైతుల ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేసిన 70 స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిజిపిఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎం.ఎస్‌ రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు.సేంద్రీయ వ్యవసాయ ఆవశ్యకత, రసాయన ఎరువుల మరియు పురుగుమందుల విచ్చలవిడి వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతింటుందని రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆసియా పిజిపిఆర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన మహాకిసాన్‌ మేళ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో అన్నారు. రసాయన ఎరువుల వినియోగం తెలంగాణలో గత పదేళ్లలో గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం భారతదేశ వినియోగం, అన్ని రకాల ఎరువులు కలుపుకొని 600 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే 40 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని, అదేవిధంగా దేశంలో సగటు పురుగుమందులు వినియోగం కంటే కూడా తెలంగాణ వినియోగం అధికంగా ఉందని, కావున మనమిప్పుడు కేవలం ఉత్పత్తి మీదనే కాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీయడం మీద దృష్టిసారించాలని హితవు పలికారు.అదేవిధంగా గత 30 సంవత్సరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాధించారో వివరిస్తూ.. ప్రస్తుతం ఆ పంట సాగుకు గల అవకాశాలు మరియు ఆయిల్‌ పామ్‌ పంటలో వేయగల అంతరపంటల సాగు గురించి తన అనుభవాలను పంచుకొన్నారు.తరువాత వివిధ జిల్లాల నుండి ఎంపిక చేసిన ఆదర్శరైతులకు రైతురత్న అవార్డులను అందచేశారు. మహాకిసాన్‌ మేళాలో భాగంగా రైతుల ప్రయోజన నిమిత్తం ఏర్పాటు చేసిన 70 స్టాల్స్‌ రైతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిజిపిఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎం.ఎస్‌ రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు

Read More

పదెకరాల్లో సమీకృత వ్యవసాయం చేయగలను

ఆంధ్రప్రదేశ్‌ వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్రప్రసాద్‌ చేస్తున్న సమీకృత వ్యవసాయం విధానాన్ని నల్లమాడులో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎకరా విస్తీర్ణంలో వరి, మత్స్య, కూరగాయలు సాగు చేస్తున్న తీరును రైతు చంద్రబాబుకు వివరించారు. ఇదే సాగును పది ఎకరాల్లో చేయగలవా? అని సీఎం ఆరా తీయగా, చేయగలనని రాజేంద్రప్రసాద్‌ బదులిచ్చారు.

Read More