రైతుల ఆదాయం పెరగాలి

వ్యవసాయంలో ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రయోగ ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలని, అన్నదాతల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌, పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డిలు… సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘వాతావరణ మార్పులు, మార్కెట్‌ ఒడుదొడుకులతో ధరల పతనం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. వీటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపాలి. అగ్రివర్సిటీ చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, కరువు, చీడపీడలను ఎదుర్కొనే విత్తన రకాలను కనిపెట్టాలి’ అని సూచించారు. వర్సిటీలో పెండింగులో ఉన్న మూడు బ్యాచ్‌లకు వచ్చే ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించి 2,800 మందికి పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తామని ఈ సందర్భంగా వీసీ తెలిపారు.

Read More

హార్టీకల్చర్‌ డిగ్రీ కోర్సులకు 17న కౌన్సెలింగ్‌

ఈ నెల 17న కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో ఖాళీగా ఉన్న బీఎస్సీ (హార్టికల్చర్‌) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ రాజిరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో 15 సీట్లు, వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాలలో 32 సీట్లు, మహబూబాబాద్‌ జిల్లాలోని మల్యాల కళాశాలలో 10 సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.skltghu.ac.in, www.pjtau.edu.in లేదా 9652456779 నంబరులో సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌కి పండ్లు, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది. 8.07 లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్‌ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.

*రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు* ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వు బ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ. 1,41,609 (స్థిర ధరల వద్ద) గా పేర్కొంది. సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు, ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.

*సగటు జీవన కాలం 70 ఏళ్లు* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ

Read More

పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ పనితీరులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానం

పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.

Read More

విత్తన చట్టం-2025లో రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి

విత్తన చట్టం- 2025లో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాల పరిమితితో కూడిన పరిహారం చెల్లించే నిబంధన ఉండాలని, రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలన్నారు. విత్తన చట్టం ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేర్చాల్సిన అంశాలు, అభ్యంతరాలపై తుది నివేదిక రూపకల్పనకు బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు.

విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ప్రత్యేక విభాగం ఉండాలి. విత్తనాలను సరసమైన ధరలతో రైతులకు అందించేలా ధరల నియంత్రణను తప్పనిసరి చేయాలి. రాష్ట్ర విత్తన కమిటీకి ప్రత్యేకమైన విత్తన రకాలను ఎంపిక చేసుకునే అధికారం ఇవ్వాలి.

రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు విత్తన ధరలను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దాఖలు పరచాలి. విత్తన ధరలపై సమీక్ష, హేతు బద్ధమైన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి రాష్ట్ర విత్తన కమిటీలను అనుమతించాలి.

ఉత్పత్తి సంస్థలు నేరాలకు పాల్పడితే అయిదేళ్లపాటు విత్తన ఉత్పత్తి అమ్మకాలను నిషేధించాలి. విత్తన కంపెనీలకు లైసెన్సు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని తుమ్మల సూచించారు. ఆయా అంశాలను మూసాయిదా బిల్లులో చేర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

విత్తన చట్టం ముసాయిదాలో సవరణలపై నివేదిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు.

Read More

51 లక్షల టన్నులకు గాను 17.3 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే సేకరించాము

నిన్న ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ 'ఈ ఏడాది రాష్ట్రంలో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించగా, ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. 2.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,120 కోట్లు జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16 వేల మంది సిబ్బంది, 32 వేల వాహనాలు పని చేస్తున్నాయి. 7.85 కోట్ల గోనె సంచులు అందించామ'ని మంత్రి మనోహర్‌ తెలిపారు. 'రాష్ట్రంలో ఎఫ్‌సీఐకి ప్రస్తుతం 7.85 కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, మరో 3.87 కోట్ల టన్నుల మేర పెంచేందుకు కేంద్ర మంత్రి జోషీ అంగీకరించారు. ఇందుకోసం పీపీపీ విధానంలో స్టీల్‌ సైలోస్‌లు ఏర్పాటు చేస్తాం. వడ్లు అధికంగా పండించే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీటిని నిర్మిస్తాం. తద్వారా ధాన్యం నిల్వనష్టాలు తగ్గి, గింజ నాణ్యత పెరుగుతుంది' అని వివరించారు.
Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఐఐఎంఆర్‌ ప్రోత్సాహకంతో వివిధ రాష్ట్రాలలో చిరుధాన్యాల సాగు

చిరుధాన్యాల సాగు విస్తరణకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) వివిధ రాష్ట్రాల్లో ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఆర్థిక తోడ్పాటుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుంటున్న ఎఫ్‌పివోలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం రాజుపాకలు కేంద్రంగా చిరుధాన్యాల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై పనిచేస్తున్న లంబసింగి ట్రైబల్‌ ప్రొడక్ట్స్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌కు తోడ్పాటును అందించేందుకు ముందుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో లంబసింగి ఎఫ్‌పిఓసభ్యులు పండిస్తున్న చిరుధాన్యాలతోపాటు వాటితో తయారుచేసిన విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా సంచార విక్రయశాలను ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తారా సత్యవతి ప్రారంభించారు

Read More