తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కోతుల బెడదతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి లోకసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమస్యను అటవీశాఖ దృష్టికి తీసుకెళ్తే మాకేమీ సంబంధంలేదంటున్నారు. అలాగే పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలు కూడా నోడలు ఏజెన్సీలుగా వ్యవహరించడంలేదు. కేంద్రం తక్షణం స్పందించి కోతులు, జింకల నివారణ కోసం ఒక ప్రత్యేక నోడల్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.