కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.