పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ యోగ్యంగా పోడు భూములు

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో (2025-26 నుంచి 2029-30 వరకు) సోలార్‌ పంపు సెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్లు… తర్వాత ఒక్కో ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈనెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ. శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2025-26 కార్యాచరణ
మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లా స్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలిచి, ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలి.

రైతుల అర్హతలు: – అటవీ హక్కుల చట్టం (2006) కింద 6.69 లక్షల ఎకరాలపై 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు.. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి, నీటివసతి కల్పిస్తారు.

  • రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌ వెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.
  • అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు, నిర్మల్‌, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.
Read More