పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More

రాష్ట్రంలో పాడిపశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పాడిపశువులకు జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని కింద శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 20 లక్షల పాడిపశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు వేస్తామని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణ అధికారి సి. హెచ్‌. మల్లీశ్వరి తెలిపారు. గతంలో కృత్రిమ గర్భధారణకు రుసుములు వసూలు చేసేవారని, కేంద్ర కార్యక్రమం ద్వారా పాడిరైతులు ఇప్పుడు ఉచిత సేవలు పొందవచ్చని వివరించారు. దీని కింద రైతులకు ఆర్థికభారం తగ్గడంతోపాటు మేలు జాతి పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుందన్నారు.

Read More