వ్యవసాయ మరియు సహకార రంగానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించిన తుమ్మల, కోదండరెడ్డి

ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ చైర్మన్‌ కోదండ రెడ్డి, వ్యవసాయశాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి, వ్యవసాయ మరియు సహకార రంగానికి సంబంధించి అనేక అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ, సహకార రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం దిశగా చర్చలు చేపట్టడానికి అనువుగా ఈ సమావేశం నిర్వహించుకోవాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మట్టి నమూనా ఫలితాలు ప్రతీ రైతుకు అందించేటందుకు ప్రభుత్వము కట్టుబడి ఉంది కనుక దానికి తగ్గ విధివిధానాల రూపకల్పనలో కమిషన్‌ అభిప్రాయాలు తెలియజేశారు. తరువాత సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ డైరెక్టర్‌ గోపిని ఉద్ధేశించి మాట్లాడుతూ, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అమలు అవుతున్న కార్యక్రమ అమలు తీరు తెలుసుకొని, ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము నిర్వహించ తలపెట్టిన వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ 29 మే 2025 నుండి 12 జూన్‌ 2025 వరకు కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మట్టి నమూనా పరీక్షలు త్వరితగతిన పూర్తిచేయడానికి సాయిల్‌ టెస్టింగ్‌ లాబ్స్‌ను ఎఫ్‌పిఓలకు అందచేయడం ద్వారా, రైతువేదికలలో పెట్టడం ద్వారా, ప్రతీ అవసరమున్న రైతుకు మట్టినమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కల్పించడానికి డైరెక్టర్‌ గోపికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ద్వారా ప్రతీ రెవిన్యూ గ్రామాలలో ముగ్గురు ఎంపిక చేసిన రైతులకు మూల విత్తనము (ఫౌండేషన్‌ సీడ్‌) ను ఇవ్వడానికి, డిపార్ట్‌ మెంట్‌ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మూలవిత్తనం సరఫరా చేసిన రైతుల పొలాల నిరంతర పర్యవేక్షణ చేస్తూ, అలా ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులకు తిరిగి చేరేవిధంగా చూడాలని, అప్పుడే కార్యక్రమం యొక్క లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More