చీడపీడల నివారణలో ఐఐసీటీ కీలక పురోగతి6 మాలిక్యూల్స్‌ ఫార్ములేషన్‌ థలో పరిశోధనలు

పంటల సాగుకు ఉపయోగపడే రసాయనాల అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలక పురోగతి సాధించింది. కలుపు నివారణ, కీటకాలు, శిలీంధ్రాల నుంచి పంటలను కాపాడటంలో మెరుగైన గుణం కలిగిన 6 మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించింది. పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సోకే పలు తెగుళ్లు. కత్తెర, గులాబీ పురుగు వంటివాటి నివారణకు ఇవి దోహదపడతాయని ప్రాథమిక పరిశోధనల్లో గుర్తించారు. ప్రస్తుతం ఇవి సమర్థత (ఎఫికసీ) పరీక్షల థలో ఉన్నాయని.. అక్కడ విజయవంతమైతే వ్యవసాయరంగంలో కీలకంగా మారుతాయని ఐఐసీటీ పరిశోధకులు తెలిపారు. భారత్‌లో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, పురుగుమందులను అధికంగా చేసుకుంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశీయంగా రసాయనాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి పెట్టింది. ఈ దిశగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) కు చెందిన పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి.

  • సీఎస్‌ఐఆర్‌కు చెందిన ‘హెడా క్వార్టర్‌ కోఆర్డినేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆగ్రో మిషన్‌-1, 2లను చేపట్టింది. మొదటి మిషన్‌లో 12 మాలిక్యూల్స్‌కు సంబంధించి ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టారు. మన దేశంలో వ్యవసాయ పరిశ్రమలకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు దేశీయంగా వీటిని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా పేటెంట్‌ పూర్తయిన మాలిక్యూల్స్‌కు సంబంధించి ఈ ప్రక్రియను చేపట్టారు.
  • ఆగ్రో మిషన్‌-2లో.. ఐఐసీటీతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 8 సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతో కలిసి 20 మాలిక్యూల్స్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఐఐసీటీ ఒక్కటే 10 మాలిక్యూల్స్‌ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ పై పరిశోధనలు చేపట్టింది. ఇవికాకుండా న్యూ కెమికల్‌ ఎంటిటీస్‌ (ఎన్‌సీఎస్‌) పరిశోధనలు చేపట్టారు. మొత్తం 250 మాలిక్యూల్స్‌పై కొత్తగా సంశ్లేషణ ప్రక్రియ (సింథసిస్‌) జరిపి అందులో 6 లీడ్‌ (మరింత కచ్చితమైన) మాలిక్యూల్స్‌ను గుర్తించారు. వీటికి సంబంధించి 10, 20 గ్రాముల పరిమాణాల్లో అభివృద్ధిచేసి దిల్లీలోని ఐపీఎఫ్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ)కి పంపించారు. అక్కడ ఫార్ములేషన్‌ ప్రక్రియ పూర్తయి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పనితీరును పరీక్షిస్తారు. ఆ ఫలితాలను బట్టి తదుపరి కిలో స్థాయిలో ఉత్పత్తి చేపడతారు. తర్వాత సెంట్రల్‌ ఇన్సెక్టిసైడ్స్‌ బోర్డ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీఆర్‌సీ) అనుమతి తీసుకుని పరిశ్రమలతకొన్ని రకాల చీడపీడల బారి నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.
Read More

వరికి బదులు పామాయిల్‌, అంతర పంటలను ప్రోత్సహించాలి – మంత్రి తుమ్మల

అధికారులు, ఉద్యోగులు ఎప్పటికప్పుడు రైతులను చైతన్య పరచాలని, వరికి బదులు పామా యిల్‌ వంటి లాభదాయక, అంతర పంటలను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జరిగిన తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. మంత్రి పాల్గొని మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షుడు చిన్నా రెడ్డి, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్‌ బి. కృపాకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్రెడ్డి ఇతర అధికారులు అనురాధ, రవీందర్‌, శశిధర్‌ రెడ్డి, మానస, వీణ తదితరులు పాల్గొన్నారు. మామిడిసాగుకు ఉత్తరప్రదేశ్‌ తరహా విధానాలు మామిడిసాగులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌ తరహా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. యూపీ ఉద్యాన సహకార మార్కెటింగ్‌ సమాఖ్య ఎండీ వినయ్‌ కుమార్‌ ఆదివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వినయ్‌ యూపీలో మామిడి సాగు విధానాలను వివరించారు. ఆయన వెంట తెలంగాణ ఉద్యాన సంయుక్త సంచాలకుడు బి. బాబు ఉన్నారు. అంతకుముందు యూపీ ఉద్యానవన సహకార సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ఉద్యాన శిక్షణ సంస్థలో కొనుగోలు, అమ్మకందారుల సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా, ఇతర అధికారులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ

వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్‌ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్‌ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్‌, మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Read More

4 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమి మరియు అందులో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. యాచారం మండల కేంద్రంలోని 2 వేల గజాల భూమిని వ్యవసాయ శాఖకు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును కలిసి భూమికి సంబందించిన పత్రాలను అందించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నెలరోజుల క్రితమే రైతు కమిషన్‌ బృందం, వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న భూమిని అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపితోపాటు మార్కెటింగ్‌ అధికారులకు చూపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రైతు మిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. అందులో రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్‌ పంటలు నిలువ కోసం వాడుకుంటున్నారు. ఐతే ఇక ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు రాసిస్తే.. రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపిలకు ఈ విషయం చెప్పి స్థలానికి సంబంధించి పేపర్స్‌ను అందజేశారు. అదేవిదంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని రైతు కమిషన్‌ కోరింది. దానికి సంబంధించి ప్రైవేట్‌ స్థలం యాచారం బస్టాండ్‌కు అనుకొనే ఉన్నట్లు కమిషన్‌ బృందం.. మంత్రికి వివరించారు. ఆ స్థలాన్ని సేకరించి మార్కెట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇక పలు అంశాలపై వ్యవసాయ మంత్రితో కమిషన్‌ చర్చించింది. ఈ సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్‌ రెడ్డి, భవానీ రెడ్డి, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, ఏవో హరి వెంకట ప్రసాద్‌లు ఉన్నారు.

Read More

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లో అడ్మిషన్‌

10వ తరగతి లేదా ఇంటర్‌ పాస్‌ అయ్యి, 22సం|| లోపు వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులు అగ్రికల్చర్‌ డిప్లొమా / అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో చేరుటకు పాలీసెట్‌ పరీక్ష రాయకపోయినా డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో అడ్మిషన్‌ పొందుటకు అవకాశం కలదు. పరిమిత సీట్లు కలవు. 10వ తరగతి మెమో, టి.సి., బోనఫైడ్‌, కులధృవీకరణ సర్టిఫికెట్‌తో కాలేజీలో ఆగష్టు, 2025 మొదటి వారంలోపు సంప్రదించండి.డైరెక్టర్‌*డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌*(Affiliated to Professor Jayashankar Telangana Agricultural University, Rajendranagar)తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్‌ జిల్లాఫోన్‌: 9493461818, 9989147966

Read More

చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులు విడుదల

ప్రోత్సాహక ధర కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తోతాపురి మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహక నగదు చొప్పున మొత్తం 6.50 లక్షల టన్నులకు రూ.260 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నామని డీడీ పేర్కొన్నారు.

Read More

మన రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు

మన రైతులకు నీళ్ళిస్తే బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్ని శరవేగంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్‌-2 పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గురువారం హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ”నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేస్తే కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 33 లక్షల మందికి తాగు నీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో నెరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం” అని వివరించారు.

Read More

జాతీయ పురస్కారం అందుకున్న పార్వతీపురం శాస్త్రవేత్త

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. వైకుంఠపు పాపారావుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐసీఏఆర్‌ స్థాపన దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

Read More

పార్లమెంటు క్యాంటీన్‌లో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా

పార్లమెంటును సందర్శించే వారికి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించేలా కొత్త మెనూ తయారైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకువస్తున్నారు. కొత్త మెనూలో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా, మూంగాల్‌ చిల్లా, కాల్చిన చేప వంటి రకరకాల వంటలను ఉంచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పీచు పదార్థాలు అధికంగా ఉండే సలాడ్లు, ప్రొటీన్‌లతో నిండిన సూప్‌లను మెనూలో ఉంచారు. ఈ ఆహారాన్ని ఎంపీలకు మాత్రమే కాకుండా అధికారులకు, పార్లమెంటు సందర్శకులకు సైతం అందించనున్నారు.

Read More

వ్యవసాయ పరిశోధన సంచాలకుడు బలరామ్‌ ఆవిష్కరించిన హైబ్రిడ్‌ వరి విత్తనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్‌

హైబ్రిడ్‌ వరి పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు మరాఠి బలరామ్‌ మూడు దేశాల పేటెంట్లను పొందారు. ఇప్పటికే ఆయనకు భారత్‌తోపాటు అమెరికాలో పేటెంట్‌ లభించింది. తాజాగా ఫిలిప్పీన్స్‌ నుంచి పేటెంట్‌ పొందారు. బలరామ్‌ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)లో ఫెలోషిప్‌ సందర్భంగా పరిశోధన చేపట్టారు. ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరాగ సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రకాన్ని కనుగొన్నారు. దీనికి 2020లో అమెరికా పేటెంట్‌ లభించగా.. 2023లో భారత్‌లో పేటెంట్‌ వచ్చింది. తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్‌ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ధ్రువీకరణపత్రాన్ని పంపింది. 2036 జూన్‌ 5 వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు.

Read More