ప్రోత్సాహక ధర కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తోతాపురి మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహక నగదు చొప్పున మొత్తం 6.50 లక్షల టన్నులకు రూ.260 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నామని డీడీ పేర్కొన్నారు.

18 Jul, 2025
