చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులు విడుదల

ప్రోత్సాహక ధర కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తోతాపురి మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహక నగదు చొప్పున మొత్తం 6.50 లక్షల టన్నులకు రూ.260 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నామని డీడీ పేర్కొన్నారు.

Read More

తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును భరించమని కేంద్ర వ్యవసాయ మంత్రికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి వినతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తోతాపురి మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది దిగుబడులు పెరగడము వలన తోతాపురి మామిడి ధరలు తగ్గాయి. దీంతో రైతులు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కిలో మామిడికి కనీస మద్దతు ధరను రూ.12గా నిర్ణయించింది. అందులో వ్యాపారులు 8 రూపాయలు, మిగిలిన 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయించింది. ఈ ఏడాది 6.50 లక్షల టన్నుల సరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా. కిలోకు రూ.4 చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.260 కోట్ల భారం పడుతోంది. ప్రభుత్వ ఆర్ధిక సమస్యల దృష్ట్యా ఈ మొత్తాన్ని కేంద్రమే అందించేలా చర్యలు తీసుకోండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More