అన్ని ప్రాంతాల్లోనూ వేప చెట్లకు మళ్లీ తెగులు సోకింది, కొమ్మలు ఎండిపోతున్నాయి, చెట్లకు పూత రావడం లేదు. అంతో ఇంతో వచ్చినా కాయలుగా మారడం లేదు. డైబ్యాక్ అనే శిలీంధ్రం వల్ల ఈ సమస్య తలెత్తిందని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. టీ దోమ అనే కీటకమూ మరో కారణమని తేల్ౘ్ారు. ఈ తెగులు సోకితే చెట్టు పైభాగం నుంచి మొదలై.. కింది వరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయి. పూత మాడిపోతుంది. 100% గింజ ఉత్పత్తి ఉండదు.

పరిష్కారం: ఎండిపోయిన చోటుకు 15 సెం.మీ. దిగువన (కొమ్మ ఆరోగ్యంగా ఉన్నచోటకు) కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలను దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలి. లేదంటే శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా ఇతర ఆరోగ్యకర చెట్లకు వేగంగా వ్యాప్తి చెందుతాయి. చెట్ల కింద రాలిన వేప ఆకులతో సాయంత్రం పొగ వేయడం ద్వారా టీ దోమల్ని నియంత్రించవచ్చు. చెట్టు మొదలులో వేప పిండి, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.