ఔషధ మొక్క… పునర్నవ

సాధారణ నామం : ఎర్రగలిజేరు శాస్త్రీయ నామం : బోయెర్‌హేలియా డిఫ్యూసా కుటుంబం: నిక్టాజినేసి

ప్రాకే కొమ్మలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు అసమానంగా ఉంటాయి. అండాకారంలో ఉండి అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆకుకాడ 1 సెం.మీ. పొడవుంటుంది. పూలు 4 సెం.మీ. పొడవుండి, 4-10 పూవులు కలసి ఉంటాయి. కాప్సూల్ 3þ1 మి.మీ. పరిమాణంలో గద ఆకారంలో ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పురాతన కాలం నుండి పునర్నవను ఎపిలెప్పి, హిస్టీరియా, గాస్ట్రెåటిస్, జాండిస్, జ్వరం, ఆస్త్మా, డిసెంట్రి, డయేరియా వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. మూత్రనాళం ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ద్రవాలను బయటకు పంపడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీర బరువు తగ్గించడానికి, సహజ యాజమాన్య పద్ధతిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రవర్ధకం. జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం, ఆకుకూరగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • అనేక అతిధి మొక్కలలో పునర్నవ ద్రావణం గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు యాంటివైరల్ కారకాలు ఉత్పత్తి అయ్యాయి (అవస్థి, అతని అనుచరులు, 2013).
  • పరిపక్వత చెందిన మొక్కల ఎండబెట్టిన వేర్ల ద్రావణం లేదా దాని నుండి వేరు చేసిన గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్, టమాటలో కుకుంబర్ మొజాయిక్ వైరస్, టాబాకోమొజాయిక్ వైరస్‌లు, మెలన్‌లో కుకుంబర్ గ్రీన్‌మాటిల్ వైరస్, జనుములో సన్‌హెంప్ రొసెట్టెవైరస్, గాంఫ్రెనాగాబోసాలో గ్రాంఫెనా మొజాయిక్ వైరస్ ఆశించడాన్ని నివారించింది (అవస్థి, అతని అనుచరులు, 1984).
  • రెండు ఔషధ మొక్కలు పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల గ్రాన్యూల్ పార్ములేషన్లు తయారు చేసి పరీక్షించినపుడు పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపాయి. ఈ పురుగులని ఈ రెండు మొక్కలు సమర్ధవంతంగా నివారించగలవని రుజువైంది (బిందు, ఆమె అనుచరులు, 2016).
  • మొక్కల ఆకు పొడిని తయారు చేసే విధానం : పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక ఆకులను డిస్టిల్డ్ వాటర్‌లో బాగా కడిగి ఆకులను నీడలో ఆరబెట్టి గ్రైండర్‌లో వేసి విడివిడిగా పొడిచేయాలి. దీనిని జల్లించి మెత్తని పొడిని గాజు పాత్రలలో నిల్వ చేయాలి.
  • గ్రాన్యులార్ ఫార్ములేషన్ తయారీ : మొక్కల ఆకుల పొడి, నూనె చెక్క, పొడి బరువు తూయాలి. డిస్టిల్డ్ వాటర్ కలిపి నూనె చెక్కపొడిని రెండు మొక్కల ఆకుల పొడులతో విడివిడిగా కలిపి గ్యాన్యూల్స్ రూపంలో ఫార్ములేషన్ తయారు చేయాలి. 15%, 20%, 25%, 30%, 35%, గ్రాన్యూల్ ఫార్ములేషన్లను (1.5 గ్రా, 2.0 గ్రా., 2.5 గ్రా., 3.0 గ్రా., 3.5 గ్రా. ఆకు పొడిని 8.5 గ్రా., 8.0 గ్రా., 7.5 గ్రా., 7.0. గ్రా., 6.5 గ్రా., నూనె చెక్కపొడితో కలిపి రెండు మొక్కల ఫార్ములేషన్లు) తయారు చేయాలి.
  • పునర్నవ మొక్కను ఇంటిలో వ్రేలాడదీస్తే పేలు వికర్షించపబడతాయి (డెల్ౙీల్, 1861).
  • పునర్నవ మొత్తం మొక్క ద్రావణం టమాట బాక్టీరియల్‌విల్ట్ కారకం రాల్‌స్టోనియా సొలనేసియారంపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (తువు, అతని అనుచరులు, 2017).
  • పునర్నవ కషాయం వైరస్ నివారిణిగా టమాట ఆకు ముడత వైరస్, టమాట మొజాయిక్ వైరస్, పొటాటో వైరస్, వంగ మొజాయిక్, టమాట యెల్లో మొజాయిక్ వైరస్, పెసర యెల్లో మొజాయిక్ వైరస్, బీన్ కామన్ మొజాయిక్ వైరస్‌లను నివారిస్తుంది.
  • 5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్రస్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్‌ని మొక్క దశ నుండి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
  • పంటలను అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.

5% పునర్నవ కషాయం తయారు చేసే పద్ధతి :

  • 5 కి. పునర్నవ వేర్లు, కాడలు, ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి, వడపోసి 100 గ్రా. సబ్బు పొడి లేదా కుంకుడు కాయల రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలోని పంటపై పిచికారి చేయాలి.
  • ఎర్రగలిజేరు వేరు నీటి ద్రావణం పిచికారి పెసర, మినుము పంటలనాశించే మూంగ్‌బీన్ ఎల్లోమొజాయిక్ వైరస్, బీన్‌కామన్ మొజాయిక్ వైరస్ ఆశించచడాన్ని క్షేత్ర పరిస్థితులలో తగ్గించి గింజ దిగుబడులను పెంచింది (సింగ్, 2002, సింగ్ అండ్ అవస్థి, 2002).
  • దోస జాతి పంటలలో వారానికొకసారి ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి చేసి, కుకుంబర్ మొజాయిక్ వైరస్, బాటిల్‌గార్డ్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్‌మొజాయిక్ వైరస్, పంప్‌కిన్ మొజాయిక్ వైరస్‌లు ఆశించడం, వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడాన్ని గణనీయంగా అరికట్టారు (అవస్థి అండ్ కుమార్ 2003 ఎ, 2003 బి, కుమార్ అండ్ అవస్థి, 2003ఎ, 2003బి).
  • కుకుంబర్ మొజాయిక్ తెగులు ఆశించడం, వ్యాపించడం ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి ద్వారా అరికట్టబడింది (కుమార్ అండ్ అవస్థి, 2008).
  • టమాట పంటలో ఎర్రగలిజేరు వేరు ద్రావణంతో విత్తనశుద్ధి, పంటపై పిచికారి చేయడం ద్వారా వైరస్ తెగుళ్ళను నివారించారు (అవస్థి అండ్ యాదవ్, యాదవ్, అతని అనుచరులు)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఎల్‌నినో ప్రభావం: పంటలపై కీటకాల ఉధృతి — రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ మార్పులతో మారుతున్న కీటకాల ప్రవర్తనను అర్థం చేసుకొని, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంతో నష్టాలను నివారిద్దాం

పరిచయం
వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. విజయవంతమైన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, సకాలంలో వర్షాలు, సరైన ఉష్ణోగ్రతలు, తగిన నేల తేమ వంటి అంశాలు అత్యంత కీలకం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు (Climate Change) వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వడగాడ్పులు (Heat Waves) వంటి పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు దోహదపడే ప్రధాన కారణాల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి. ఎల్‌నినో ప్రభావం పంటల పెరుగుదలపైనే కాక, పంటలను ఆశించే కీటకాల జీవన చక్రం, సంతానోత్పత్తి రేటు, వ్యాప్తి, హానికారకత్వంపై కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. కొన్ని కీటకాలు అసాధారణంగా విజృంభించి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తే, మరికొన్నింటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి “ఎల్‌నినో సంవత్సరాల్లో ఏ కీటకాలు ఎక్కువగా విజృంభిస్తాయి? ఏ పంటల్లో ఎక్కువ నష్టం సంభవించే అవకాశం ఉంది? రైతులు ఎలాంటి ముందస్తు, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి?” అనే అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 0.5°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగి, ఆ పరిస్థితి కనీసం ఐదు వరుస నెలలపాటు కొనసాగినప్పుడు నిర్ధారించే ఒక సహజ సముద్ర-వాతావరణ దృగ్విషయం (ENSO వ్యవస్థలో వెచ్చని దశ).
సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు (Trade Winds) వెచ్చని ఉపరితల జలాలను ఇండోనేషియా వైపుకు నెట్టివేస్తాయి. ఎల్‌నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు మధ్య-తూర్పు పసిఫిక్‌లోనే పేరుకుపోయి, ప్రపంచ వాతావరణ ప్రసరణ మార్గాల్లో మార్పులకు కారణమవుతుంది.

ఈ మార్పుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై, ముఖ్యంగా భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ కింది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ:
• సాధారణం కంటే తక్కువ, అనిశ్చిత వర్షపాతం
• నైరుతి రుతుపవనాల బలహీనత లేదా ఆలస్యం
• పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు
• నేల తేమ తగ్గుదల
• దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు

గమనిక: ఇవి సంభావ్యతలు మాత్రమే — ఎల్‌నినో ఉన్న ప్రతి సంవత్సరం భారతదేశంలో కరువు తప్పనిసరిగా వస్తుందని కాదు; స్థానిక భౌగోళిక అంశాలు, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి ఇతర అంశాలు కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో కీటకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
కీటకాలు శీతల రక్త జీవులు (Poikilothermic/Cold-blooded organisms) — వాటి శరీర ఉష్ణోగ్రత పరిసర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణంలో స్వల్ప మార్పులు కూడా వాటి పెరుగుదల రేటు, జీవిత చక్రంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు:
• గుడ్లు వేగంగా పొదుగుతాయి
• లార్వా దశ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది
• ప్యూపా దశ కాలం తగ్గుతుంది
• పెద్ద పురుగులు త్వరగా లైంగిక పరిపక్వత చెంది సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి
• ఒకే పంట కాలంలో ఎక్కువ తరాలు (generations) అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది

తక్కువ వర్షపాతం వల్ల:
• భారీ వర్షాల ద్వారా సహజంగా కొట్టుకుపోయే పురుగుల మరణాల రేటు తగ్గుతుంది
• ఆకులపై నివసించే చిన్న, మృదుకాయ కీటకాలు సులభంగా మనుగడ సాగిస్తాయి
• అధిక తేమ అవసరమయ్యే కీటక-పరాన్నజీవి శిలీంధ్రాలు (entomopathogenic fungi వంటివి) సమర్థంగా వృద్ధి చెందక, కీటకాల సహజ మరణాల రేటు తగ్గుతుంది
ఫలితంగా కొన్ని కీటక జాతుల జనాభా వేగంగా పెరిగి, ఆర్థిక నష్టపు గరిష్ఠ స్థాయిని (Economic Threshold Level) దాటే అవకాశం ఏర్పడుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభించే కీటకాలు
ఎల్‌నినో ప్రభావంతో అన్ని కీటకాలు ఒకేలా పెరగవు. ప్రధానంగా వేడి, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండే జాతులు మాత్రమే వేగంగా విస్తరిస్తాయి.

  1. రసం పీల్చే పురుగులు (Sap-Sucking Insects)
    ఎల్‌నినో పరిస్థితుల్లో అత్యధికంగా పెరిగే కీటక సమూహం ఇదే. ఇందులో తెల్లదోమలు, తామర పురుగులు (Thrips), పేనుబంక (Aphids), జాసిడ్లు, మీలీబగ్స్, స్కేల్ కీటకాలు ప్రధానమైనవి. ఇవి మొక్కల ఆకులు, లేత కొమ్మలు, పూతలు, పిందెల నుండి కణరసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి.
    ఎక్కువగా పెరగడానికి కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాపేక్ష ఆర్ద్రత, వేగవంతమైన జీవితచక్రం, అధిక సంతానోత్పత్తి సామర్థ్యం.
    కలిగించే నష్టం: మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం, పూత-పిందె రాలిపోవడం, దిగుబడి తగ్గుదల, వైరస్ వ్యాధుల వేగవంతమైన వ్యాప్తి.
  2. తామర పురుగులు (Thrips)
    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో సంవత్సరాల్లో అధికంగా నమోదయ్యే కీటకాల్లో ఇవి ముఖ్యమైనవి. మిరప, ఉల్లి, వేరుశెనగ, పత్తి, ద్రాక్ష, పూల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. త్రిప్స్ ఆకు ఉపరితలాన్ని గీరి కణరసాన్ని పీల్చడం వల్ల ఆకులపై వెండి-బూడిద రంగు మచ్చలు/గీతలు (silvering) కనిపిస్తాయి. తీవ్ర ఉధృతిలో ఆకులు ఎండిపోయి పంట పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మిరపలో ఇవి “ఆకుముడత” (leaf curl) వ్యాధి వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
  3. తెల్లదోమ (Whitefly)
    తెల్లదోమ అనేక మొక్కల వైరస్ వ్యాధులకు (ముఖ్యంగా బిగోమోవైరస్‌లకు) ప్రధాన వాహకం. ఎల్‌నినో పరిస్థితుల్లో వీటి జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పత్తి, టమాట, బెండ, మిరప, సోయాబీన్ పంటల్లో అధిక నష్టం కలిగిస్తుంది — ప్రత్యక్ష రసం పీల్చడం ద్వారానే కాక, వైరస్ వ్యాప్తి ద్వారా కూడా.
  4. పచ్చ నల్లి / స్పైడర్ మైట్స్ (Spider Mites)
    సాంకేతికంగా మైట్స్ కీటకాలు (Insecta) కాదు — ఇవి అష్టపాద జాతికి (Arachnida) చెందినవి. అయినప్పటికీ వ్యవసాయ సస్యరక్షణలో వీటిని హానికర కీటకాలతో పాటే పరిగణిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంలో వీటి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. పత్తి, మిరప, వంకాయ, కూరగాయలు, పండ్ల తోటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి.
  5. మీలీబగ్స్ (Mealybugs)
    మామిడి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పత్తి వంటి పంటల్లో ఎల్‌నినో సంవత్సరాల్లో మీలీబగ్స్ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటి తీపి విసర్జనం (honeydew) మీద నల్లటి బూజు తెగులు (Sooty mold) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
  6. ఫాల్ ఆర్మీవార్మ్ మరియు స్పోడోప్టెరా జాతులు
    ఫాల్ ఆర్మీవార్మ్ (Spodoptera frugiperda) మరియు టుబాకో కాటర్‌పిల్లర్ (Spodoptera litura) వంటి ఆకుతినే పురుగుల తీవ్రత ఎల్‌నినో ఒక్క కారణం వల్లనే పెరుగుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరికాదు. అయితే దీర్ఘకాలిక పొడి వాతావరణం వల్ల మొక్కలపై ఒత్తిడి (Plant stress) పెరగడం, సహజ శత్రు కీటకాల (parasitoids, predators) సంఖ్య తగ్గడం, ఆలస్యంగా వచ్చే వర్షాలు వంటి పరోక్ష కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్, కూరగాయల పంటల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో సంవత్సరాల్లో కీటకాల ఉధృతిని పూర్తిగా నివారించలేకపోయినా, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (Integrated Pest Management – IPM) ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు
    • తట్టుకునే/తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం
    • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడం (సిఫారసు చేసిన శిలీంధ్రనాశక/కీటకనాశక మోతాదులతో)
    • భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల
    • పంట మార్పిడి (Crop rotation) పాటించడం
    • పంట చుట్టూ ట్రాప్ పంటలు (marigold, castor వంటివి) వేయడం
  2. పంట పెరుగుదల దశలో నిరంతర పర్యవేక్షణ
    • ప్రతి వారం పొలాన్ని పరిశీలించి కీటకాల ఉనికిని గుర్తించడం
    • పసుపు/నీలం రంగు జిగురు అట్టలు (Yellow/Blue sticky traps) – తెల్లదోమ, తామర పురుగుల పర్యవేక్షణకు
    • లింగాకర్షక బుట్టలు (Pheromone traps) – ఆకుతినే పురుగుల ముందస్తు హెచ్చరికకు
    • ఆర్థిక నష్టపు స్థాయి (Economic Threshold Level – ETL) దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం — ముందుగానే మందులు వాడకపోవడం
  3. నీటి యాజమాన్యం
    • అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్/స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా తేమ నిర్వహణ
    • తేలికపాటి తుంపర్లు (light irrigation/sprinkling) ఇవ్వడం ద్వారా ఆకులపై పేరుకున్న కొన్ని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు
    • నీటి ఎద్దడి (moisture stress) లేకుండా చూసుకోవడం, ఎందుకంటే ఒత్తిడికి గురైన మొక్కలు కీటకాలకు మరింత లోబడతాయి
  4. జీవ నియంత్రణ (Biological Control) ప్రోత్సాహం
    • క్రైసోపెర్ల, లేడీబర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రు కీటకాలను సంరక్షించడం
    • NPV, బ్యూవేరియా బాసియానా వంటి జీవ కీటకనాశకాలను తగిన పరిస్థితుల్లో వినియోగించడం
  5. సమగ్ర రసాయన యాజమాన్యం
    • స్థానిక వ్యవసాయ శాఖ / కృషి విజ్ఞాన కేంద్రం సిఫారసులను పాటించడం
    • పురుగుల, తెగుళ్ల నిరోధకత (resistance) ఏర్పడకుండా జాగ్రత్త పడటం
    • పిచికారీకి ముందు వాతావరణ సూచనలు పరిశీలించడం — ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న వేళల్లో పిచికారీ మానుకోవడం
  6. సమాచార వినియోగం
    • భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర వ్యవసాయ శాఖల ముందస్తు హెచ్చరికలను నిరంతరం అనుసరించడం
    • సమీప కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నిపుణుల సలహాలు తీసుకోవడం
    • తోటి రైతులతో అనుభవాలు పంచుకుంటూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం

ముగింపు
ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు రైతుల నియంత్రణలో లేనప్పటికీ, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిర్ణయాలు, జీవ-రసాయన నియంత్రణ పద్ధతుల సమతుల్య వినియోగం ద్వారా రైతులు ఎల్‌నినో సంవత్సరాల్లో కూడా తమ పంటలను సురక్షితంగా కాపాడుకోగలరు.

ఈ వ్యాసంలోని సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిర్దిష్ట పంట, ప్రాంతం, తెగుళ్ల తీవ్రతను బట్టి స్థానిక వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డా. టి. నరేష్, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) మరియు డా. హరీషా ఎన్. , సహాయ ఆచార్యులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రం), విజ్ఞాన్ వ్యవసాయ మరియు సాంకేతిక సంస్థ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, గుంటూరు.

Read More

ఎల్ నినోను ఎదుర్కొందాం: పట్టురైతులకు రక్షక కవచం

మెట్ట, పాక్షిక మెట్ట పట్టురైతుల కొరకు ప్రత్యేక మార్గదర్శిని

ఎల్ నినో అంటే ఏమిటి? దీని చరిత్ర ఏంటి?
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని”ఎల్ నినో” (El Niño) అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పవనాల గతి తప్పి, భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా తీవ్ర వర్షాభావం, కరవు మరియు మితిమీరిన వేడిగాలులు (హీట్‌వేవ్స్) ఏర్పడుతాయి.

గత చరిత్ర:
• 1997-1998: దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన కరవును మిగిల్చింది.
• 2015-2016: అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
• 2023-2024: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పట్టుపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.

2026–2027 ఎల్ నినో కాలక్రమం (Timeline of the 2026–2027 El Niño Event)
ఒక బలహీనమైన లా నినా (La Niña) వేగంగా ముగిసిన తర్వాత, రాబోయే ఎల్ నినో (El Niño) యొక్క ప్రారంభ సంకేతాలను ప్రధాన అంతర్జాతీయ వాతావరణ సంస్థలు మొదటిసారిగా 2026 మార్చి నుండి మే నెలల మధ్య ముందస్తుగా అంచనా వేశాయి. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలను దాటడంతో, ఎల్ నినో పరిస్థితులు 2026 జూన్ నాటికి అధికారికంగా ప్రారంభమయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ (NOAA) మరియు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)తో సహా అంతర్జాతీయ వాతావరణ నిపుణులు, ఈ ఎల్ నినో ప్రభావం మరింత ఉధృతమై 2026 చివరి నాటికి ఒక చారిత్రాత్మక “అత్యంత బలమైన” లేదా “సూపర్” ఎల్ నినోగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిపుణుల ఖచ్చితమైన విశ్లేషణల ప్రకారం, ఈ వాతావరణ మార్పులు 97% నిశ్చితత్వంతో 2027 వసంతకాలం (మార్చి–ఏప్రిల్) ప్రారంభం వరకు కొనసాగుతాయి, దీనివల్ల దక్షిణ భారతదేశంలో సుదీర్ఘమైన కరవు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది.

ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే ముఖ్య జిల్లాల జాబితా
దక్షిణ భారతదేశంలో ఈ క్రింది మెట్ట మరియు పాక్షిక మెట్ట జిల్లాలు ఎల్ నినో బారిన పడే అవకాశం చాలా ఎక్కువ:
• ఆంధ్రప్రదేశ్: అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య.
• కర్ణాటక: కోలార్, బల్లాపూర్ స్థానంలో చిక్కబల్లాపూర్, రామనగర, తుమకూరు, చిత్రదుర్గ.
• తమిళనాడు: ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్, తిరుప్పూర్.

ఎల్ నినో వల్ల పట్టుపరిశ్రమకు కలిగే నష్టాలు
• మల్బరీ తోటల క్షీణత: నేలలో తేమ తగ్గి, ఆకుల దిగుబడి మరియు పోషకాలు పడిపోతాయి.
• అధిక ఉష్ణోగ్రత: పట్టుపురుగుల పెరుగుదలకు కావాల్సిన 24°C – 27°C కంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువవుతుంది.
• తక్కువ తేమ (Low Humidity): గాలిలో తేమ తగ్గి పురుగులు నిర్जలీకరణానికి గురవుతాయి.
• తెగుళ్లు మరియు పురుగుల దాడి: త్రిప్స్ (Thrips), తెల్లదోమ మరియు ఉజి ఈగ (Uzi fly)ల ఉధృతి పెరుగుతుంది.
• వ్యాధులు: పట్టుపురుగులకు పచ్చరోగం (Grasserie), ఫ్లాచెరీ (Flacherie) వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.

  1. మల్బరీ తోటల యాజమాన్యం (నీటి పొదుపు చర్యలు)
    బిందు సేద్యం (Drip Irrigation): డ్రిప్ పద్ధతి ద్వారా 40% నీటిని ఆదా చేస్తూ వేర్లకు నేరుగా నీరు అందించవచ్చు.
    లోతైన చారలు (Deep Trenching): వరుసల మధ్య 30 సెం.మీ లోతు కందకాలు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేయాలి.
    మల్చింగ్ (Organic Mulching): కొబ్బరి పీచు లేదా ఎండిన గడ్డిని తోటలో పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా చూడవచ్చు.
    • కత్తిరింపుల మార్పు (Pruning Shifts): వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగానే మల్బరీ కొమ్మల కత్తిరింపులు చేపట్టాలి.
  2. పట్టుపురుగుల పెంపక గృహాల (Rearing Room) నిర్వహణ
    • పైకప్పు రక్షణ: రేకుల లేదా కాంక్రీట్ రూఫ్‌లపై కొబ్బరి ఆకులు లేదా గడ్డిని దట్టంగా పరచాలి.
    • తడి గునె సంచులు (Wet Gunny Bags): కిటికీలు, తలుపులకు తడి బస్తాలను వేలాడదీసి గది ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
    • తీవ్రమైన క్రిమిసంహారక చర్యలు: వేడి వల్ల వచ్చే బ్యాక్టీరియాను అరికట్టడానికి ‘క్లోరిన్ డయాక్సైడ్’తో గదిని శుద్ధి చేయాలి.
    • పడకల సాంద్రత తగ్గించడం (Bed Thinning): ట్రేలలో పురుగుల సంఖ్యను తగ్గించి గాలి ధారాళంగా ఆడేలా చూడాలి.
    • ఆకుల నిల్వ: కోసిన మల్బరీ ఆకులను తడి గుడ్డ కింద, చల్లని ప్రదేశంలో భద్రపరచాలి.

తక్షణ వాతావరణ కార్యాచరణ పట్టిక
సమస్య: అధిక వేడి.
*తక్షణ చర్య: నేలపై ఇసుక పోసి నీరు చల్లడం; గోడలపై నీరు కొట్టడం.
లభించే ప్రయోజనం ఉష్ణోగ్రత 3°C నుండి 5°C వరకు తగ్గుతుంది

పొడి గాలి (<70% తేమ)
హ్యూమిడిఫైయర్లు లేదా తడి బొగ్గుల వాడకం
గూళ్లు కట్టడానికి తగిన తేమ లభిస్తుంది

ఆకుల కొరత
ఆకులను వర్గీకరించి, చిన్న పురుగులకు ముందుగా మేత వేయడం
నాణ్యమైన మేత వృథా కాకుండా ఉంటుంది

ఉజి ఈగ దాడి
కిటికీలు, తలుపులకు నైలాన్ నెట్ (జాళి) అమర్చడం
ఉజి ఈగలు గదిలోకి రాకుండా 100% నివారించవచ్చు

అత్యవసర సహాయం కొరకు సంప్రదించండి
• సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB): రాయితీ డ్రిప్ కిట్ల కొరకు మీ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి.
• కృషి విజ్ఞాన కేంద్రం (KVK): అత్యవసర తెగుళ్ల నివారణ సలహాల కొరకు.

• రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ: ప్రభుత్వ కరవు ఉపశమన పథకాల సమాచారం కొరకు.

రూపకర్తలు (Prepared by):
● డా. కె. శ్రీనివాస్, సైంటిస్ట్ ‘బి’ రీసెర్చ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ సబ్ యూనిట్, బీదర్ (REC SU, Bidar)
● డా. రమ్య వి., సైంటిస్ట్ ‘బి’ ప్రoతీయ పట్టుపరిశ్రమ పరిశోధనా కేంద్రం, అనంతపురం (RSRS, Anantapur)

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. నేలవేము

సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి

కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్‌లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
  • నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

నేలవేము కషాయం తయారీ విధానం

  • ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More

ఔషధ మొక్క… మచ్చల కలబంద

సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి

అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
  • అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
  • మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పురుగుల నివారణకు సహవాస పంటగా… వెల్లుల్లి

వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..

సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి

ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో

  • వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
  • ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
  • శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
  • హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
  • తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో
పురుగుల నివారణ :

  • వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
  • వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
  • వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
  • క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
  • వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)

వెల్లుల్లి గడ్డ ద్రావణం :
కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.

ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.

వెల్లుల్లి నూనె :
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)

గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ :
కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.

తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.

ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)

వెల్లుల్లి ద్రావణం నివారించే పురుగులు, తెగుళ్ళు

  • వేరుశనగలో నులి పురుగులు, స్ట్రాబెర్రీ వెస్ట్రన్ ఫ్లవర్ తామర పురుగులు
  • వెల్లుల్లి ద్రావణం ఆల్టర్నేరియా, బోట్రైటిస్, మాగ్నపోర్థె, ఫ్యుజేరియం శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది.
  • వరిలో అగ్గితెగులు, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్ (పొటాటోలేట్ బ్లెåట్)
  • దోస పంటలో బూడిద తెగులు, బూజుతెగుళ్ళను నివారించింది.
  • టమాటలో ఆకుతొలుచు పురుగు, కందిలో ఎర్రనల్లి, నులి పురుగులు
  • వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
  • గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
  • వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
  • గార్లిక్ ద్రావణం {+1% సబ్బు ద్రావణం పీచ్ పొటాటో పేనుబంక, మైజస్ పెర్సికెని నివారించింది (డాన్స్‌విక్ౙ్, అతని అనుచరులు, 2011)
  • వెల్లుల్లి, వేప, పొగాకు, కలబంద ద్రావణాలు పురుగుల నివారణకుపయోగిస్తాయి. వీ\న్నింటిలో వెల్లుల్లి ద్రావణం అతి సమర్ధవంతంగా పనిచేస్తుంది (మెలెస్, అతని అనుచరులు, 2012)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

కోతులు… బాబోయ్… కోతులు

మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న  కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్‌లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!

కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.

మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.

కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.

కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.

పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్‌హౌస్‌లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.

ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును  పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు. 

ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్‌రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.

కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు. 

మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు. 

కోతుల సంతాన నియంత్రణః
కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.

అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్‌ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్‌ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు.  ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!

అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.

పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

డా. యం.వి.జి. అహోబలరావు, ఫోన్: 9393055611

Read More

ఔషధ మొక్క – మారేడు

మారేడు ముండ్లు కలిగి మధ్యస్థంగా ఉండే వృక్షం. పత్రములు త్రిదళంగా ఉండి దళములు 6×4 సెం.మీ. పరిమాణంలో అండాకారంలో ఉంటాయి. పూలు పెద్ద పెద్ద గుత్తులుగా ఆకుపచ్చని తెలుపు వర్ణంలో ఉంటాయి. పండ్లు పెద్దవిగా గుండ్రంగా వుండి తోలు గరుకుగా, గట్టిగా వెలగపండుని పోలి ఉంటాయి. గింజలు మెత్తని కండలో ఒదిగిపోయి ఉంటాయి. పూలు, కాయలు మార్చి -మే నెలల్లో వస్తాయి..

సాధారణ నామం : బేల్, బిల్వము శాస్త్రీయ నామం : ఈగిల్ మార్మెలోస్ కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • మారేడు వేరు బెరడు, ఆకులు, పచ్చి కాయలు, పండ్లు ఔషధలక్షణాలు కలిగి ఉంటాయి.
  • వీటి నుండి కౌమారిన్, మార్మిన్, ఫినాల్స్, అంబెల్లిఫెరోన్, లూసిన్, సారాలిన్, జాంతోటాక్సిన్, స్కోపాల్టిన్, మార్మోలోసిన్ అనే రసాయనాలు లభిస్తాయి.
    పచ్చికాయలు అతిసారం మరియు రక్తవిరేచనాలను అరికట్టుటకు, వేరు బెరడు జ్వరాలను తగ్గించుటకు, పండ్లు మలబద్ధకం నివారణకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • మారేడు ఆకు ద్రావణం పెసర గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది (మురాసింగ్, అతని అనుచరులు, 2017).
  • మారేడు ఆకులు, గింజల నూనె పురుగు మందు లక్షణాలు కలిగి ఉన్నాయి (సెంటర్ ఫర్ న్యూక్రాప్స్ అండ్ ప్లాంట్‌ప్రోడక్ట్స్, 2011).
  • మారేడు చెట్టు ద్రావణాలు వరి ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు సైటోఫిలస్ సీరియలెల్లా, సైటోఫిలస్ ఒరైజె, రైజోపెర్తా డామినికపై వికర్షక చర్యను ప్రదర్శించి, సహజ పరిస్థితులలో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని ఈ పురుగులు ఆశించి నష్టపరచకుండా కాపాడాయి. (ప్రకాష్, అతని అనుచరులు, 1982, 1983)
  • మారేడు పత్ర ద్రావణాన్ని వరి మొక్కల శాఖీయదశలో పిచికారి చేస్తే గ్రీన్‌లీఫ్ హాపర్, నెఫోటెటిక్స్ విరిసెన్స్ జీవితకాలాన్ని తగ్గించింది (సత్పతి, 1983).
  • నిల్వ ధాన్యాలు, గోధుమగింజలను మారేడు ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ (500 మైక్రోగ్రాములు/మి.లీ.)తో ఫ్యూమిగేట్ చేసి నిల్వ ధాన్యాన్ని ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ మరియు గోధుమల నాశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె ఆశించకుండా కాపాడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ పురుగులు తిండి తినకుండా చేయడాన్ని గణనీయంగా పెంచి, గింజల నష్టాన్ని, గింజల బరువు నష్టాన్ని గణనీయంగా తగ్గించింది. ఎసెన్షియల్ ఆయిల్ అలసంద గింజలనాశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, పెద్దపురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది. ఈ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ నుండి, గోధుమలను రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ ఒరైజె నుండి 2 సంవత్సరాల వరకు కాపాడింది (రాజేష్‌కుమార్, అతని అనుచరులు, 2008).
  • మారేడు ఎండిన ఆకుల ద్రావణం వంగ పంటనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారించినప్పటికీ, వేప మరియు చిరాట (స్వైటియా చిరాట) ద్రావణాలు అధిక ఉత్పత్తినిచ్చాయి. (అజాద్, అతని అనుచరులు, 2012).
  • మారేడు మొక్కలో ఆల్కలాయిడ్స్, కార్డియకోగ్లెåకోసైడ్స్, టెర్పెనాయిడ్స్, సపోనిన్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్ అనే 7 ప్రధాన రసాయనాలుండి వివిధ వ్యాధులను నివారిస్తాయి. మారేడు పండు గుజ్ౙులో కెరాటినాయిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టెర్పానాయిడ్స్, ఆల్కలాయిడ్స్, పెక్టిన్స్, రెడ్యూసింగ్ సుగర్స్, సపానిన్స్, కార్బోనిల్స్, ఫ్లోబొటానిన్స్, స్టెరాయిడ్స్ ఉంటాయి (మంజేశ్వర్, అతని అనుచరులు, 2011, ధనరాజ్, అతని అనుచరులు, 2011; వెంకటేశన్, అతని అనుచరులు, 2009).
  • మారేడు పండుగుజ్ౙు ఎస్కరిచియ కోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరోజినోసా మొదలగు బాక్టీరియాపై యాంటిమైక్రోబియల్ చర్య కలిగి ఉంది (రాజన్, అతని అనుచరులు, 2009).
  • వరిలో అగ్గితెగులు నివారణకు 10% మారేడు కషాయం సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని తయారీకి 10 కి. మారేడు ఆకులను తీసుకుని 10 లీ. నీటిలో కలిపి 30 ని. మరిగించాలి. తర్వాత దీనిని చల్లార్చి కుంకుడు కాయ రసాన్ని కలపాలి. ఈ కషాయాన్ని 150 లీ. నీటికి కలిపి ఒక ఎకరంలోని పంటపై పిచికారి చేయాలి (ప్యాడి ఎ న్యూస్ లెటర్ ఫ్రం ది సేవ్ అవర్ రైస్ క్యాంపైన్, 2011).
  • 15% మారేడు ఆకుల ద్రావణాన్ని కోత తర్వాత ఆపిల్ పండ్లపై పిచికారి చేస్తే అతి తక్కువ నీటి నష్టం (3.09%) తో పండ్లు 120 రోజుల వరకు నిల్వ ఉన్నాయి (నెగి, అతని అనుచరులు, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777 కు సంప్రదించండి

Read More
  • 1
  • 2