కోకో పంటకు కూడా నిర్దేశిత ధర
కోకో పంటకూ ఆయిల్పామ్ మాదిరి నిర్దేశిత ధర నిర్ణయించాలనే యోచనలో ప్రభుత్వం ఉందనిాంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కోకోకి ధరలు తగ్గితే గతేడాది కిలోకు రూ. 50 చొప్పున ప్రభుత్వమే చెల్లించింది. మామిడి, అరటి ఏ ధరలు తగ్గినా ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు అండగా నిలిచింది. ఒక్క ఏడాదిలో రూ.1,200 కోట్లు మద్దతు ధరల రూపేణా చెల్లింపులు చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఏలూరులో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి కోకో సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.











