చేపల పెంపకంతో మంచి ఆదాయం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కి చెందిన భవాని 2007లో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో రెండేళ్లు ఉద్యోగం చేశారు. ! పెళ్లయ్యాక జబల్‌పుర్‌కు తిరిగివెళ్లి కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. కొవిడ్ విజృంభణతో కోచింగ్ సెంటర్ మూతపడటంతో.. చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఏమాత్రం అనుభవం లేకున్నా.. సవాలుగా స్వీకరించి పని మొదలు పెట్టారు. జబల్‌పుర్‌కి 15 కిలోమీటర్ల దూరంలోని హినోటియా గ్రామంలో 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పాలిథీన్ షీట్‌తో లైనింగ్ వేసే విధానాన్ని అనుసరిస్తూ.. పంగాసియస్ చేపల పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 20-30 టన్నుల చేపలను విక్రయిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు.

Read More

నిజామాబాద్ జిల్లాలో రేపు కొత్త వ్యవసాయ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం-వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్యను అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు
  • 1 ఎకరంలో లైబ్రరీ
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు. అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యంపై ప్రతిపాదనలు చేయగా, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు. వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.
Read More

త్వరలో పశు ఔషధి కేంద్రాలు

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.

Read More

దిగుమతి సుంకం సున్నా శాతంతో అమెరికా నుండి పండ్లు, కూరగాయలు

భారత్ సున్నా శాతం సుంకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98% నుంచి 99% ఉత్పత్తులపై అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు, కూరగాయలుసహా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. మంగళవారం సీఎన్‌బీసీ కార్యక్రమంలో భారత్ తో వాణిజ్య ఒప్పందం పై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ స్పందించారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ మీడియాతోనూ, ఫాక్స్ న్యూస్ నూ మాట్లాడారు.
‘భారత్‌పై అమెరికా 18శాతం సుంకాలను కొనసాగిస్తుంది. ఆ దేశంతో మాకు వాణిజ్య లోటు ఉంది. వారు పలురకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై సుంకాలను తగ్గిస్తామని అంగీకరించారు. ప్రస్తుతం భారత్‌లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5 శాతం సుంకాలున్నాయి. అవి సున్నాకు చేరతాయి. కానీ బాదం, పిస్తా వంటి ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ పానీయాలు, పండ్లు, కూరగాయలపై సున్నా శాతం సుంకాలే అమలవుతాయి. ఇది పెద్ద విజయం’ అని గ్రీర్ పేర్కొన్నారు.

Read More

తెలంగాణా రాష్ట్రానికి వ్యవసాయ పథకాల్లో రూ.51 కోట్ల కోత

తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర నిధుల కేటాయింపులో పోలిస్తే రూ.51 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మసాగునీరు, భూసార ఆరోగ్య నిర్వహణ, వర్షాధార ప్రాంత అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, వెదురు అభివృద్ధి పథకం, సహజ వ్యవసాయం తదితర కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో ఏటా రూ.1,439.49 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 60 శాతం వాటా కింద కేంద్రం రూ.871.15 కోట్లు విడుదల చేస్తోంది. ఆదివారం ప్రవేశ పెట్టిన 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.820 కోట్లు మాత్రమే పేర్కొన్నారు. రూ.51 కోట్ల మేర తగ్గించారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయాధికారులు సంప్రదించగా… ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో కొన్ని కేంద్ర పథకాలను విలీనం చేయడంతో రాష్ట్రానికి నిధులు తగ్గాయని కేంద్ర అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎం ధన్-ధాన్య కృషి యోజన అమలుకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి. దీనికింద ఏటా రూ.160 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 960 కోట్లు వెచ్చిoచాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో 31 పథకాలను విలీనం చేయగా.. అందులో తెలంగాణలో అమలయ్యే ఆరు పథకాలున్నాయి. వాటన్నింటినీ ఒకే పద్దుగా నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి రూ.50 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ధన్-ధాన్య పథకానికి అదనంగా నిధులు వస్తాయని భావిస్తుండగా… ఉన్నవాటిలో కోత విధించడంపై వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలిపారు.

Read More

ఇద్దరు పశువైద్యులకు జాతీయస్థాయి అవార్డు

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు పశువైద్యుల½ జాతీయస్థాయిలో ఇచ్ౘ్ే ‘డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన’ అవార్డుకు ఎంపికయ్యారు. ఒంగోలు వెటర్నరీ పాలీ క్లినిక్ ఉప సంచాలకుడు డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్, విశాఖలో సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు ఈ అవార్డును దక్కించుకున్నారు. సోమవారం వారిరువురినీ విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సత్కరించారు.

Read More

గోమూత్రంతో పర్యావరణ హిత సిరా

దిల్లీ విశ్వవిద్యాలయంకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు ‘గౌరంగ’ అనే పేరు పెట్టారు. గోవుల మూత్రం నుంచి వారు నీలి వర్ణ పదార్థాన్ని సేకరించారు. ఇది ద్రవ, ఘన రూపంలో వచ్ౘ్ింది. దీనికి స్వల్పంగా ఉప్పును కలిపి ఇంకును తయారు చేశారు.

Read More

మలుగులో ఉద్యాన యూనివర్సిటీ నర్సరీ

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగులో యూనివర్సిటీ ఉద్యాన నర్సరీ నెలకొల్పింది. ఈ నర్సరీలో నాణ్యమైన తెగుళ్లు సోకని పండ్ల మొక్కలు (మామిడి, జామ, సీతాఫలం, నారింజ, నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్ మొదలగునవి) పూల మొక్కలు (బంతి, చామంతి, లిల్లీ, గ్లాడియోలాస్, చైనా ఆస్టర్ వంటివి), కూరగాయలు (కిచెన్ గార్డెన్ కూరగాయ విత్తనాలు అదే విధంగా ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కలు (ఇన్సులిన్, తులసి, బిళ్లగన్నేరు, స్టీవియ, అశ్వగంధ, లెమన్ గ్రాస్, పామరోసా మొదలగునవి) లభ్యమవుతాయి. ఈ మొక్కలను యూనివర్సిటీలోని ఇతర పరిశోధన స్థానాలనుండి తెప్పించడం జరిగింది. ఇందువల్ల రైతులు ప్రైవేటు నర్సరీ నుండి కాకుండా యూనివర్సిటీ ఉద్యాన నర్సరీ నుండి నాణ్యమైన మొక్కలను తక్కువ ధరలలో కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందవచ్ౘ్ు అని యూనివర్సిటీ ఉపకులపతి డా. డి. రాజీ రెడ్డి గారు తెలియజేశారు.

ములుగు యూనివర్సిటీ ఉద్యాన నర్సరీలో అందుబాటులో ఉన్న వివిధ మొక్కల వివరాలు
పండ్ల మొక్కలు రకాలు ధర (ఒక మొక్కకు రూపాయలు)
మామిడి అంటు మొక్కలు 1.బంగినపల్లి, 2.దశేరి 60/Ð
3.ఆమ్రపాలి, 4. లాంగ్రా
సీతాఫలం బాలానగర్ 40/-
జామ లక్నో -49 40/-
నిమ్మ పెట్లూరు సెలక్షన్-1 30/-

Read More

గ్రామాలకు పెద్దపీట కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్లో గ్రామీణ వికాసానికి, రైతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసేలా వివిధ ప్రతిపాదనల్ని కేంద్ర బడ్జెట్లో ఆవిష్కరించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1,62,671 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇది 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాల మొత్తమైన రూ.1,51,853 కోట్ల కంటే 7.12% ఎక్కువ. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మించిన ఆదాయం వేర్వేరు రంగాల నుంచి వచ్చేలా చర్యలు చేపట్టామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం..

*ఈఈజడ్‌లో మత్స్య సంపదకు సుంకం ఉండదు*

సముద్రంలో ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (ఈఈజడ్) పరిధిలోని జలాల్లో భారతదేశ నౌకలు పట్టే మత్స్య సంపదపై ఎలాంటి సుంకం ఉండదు. ఈ మత్స్య సంపదను విదేశీ ఓడరేవులకు చేరిస్తే మాత్రం ఇది అక్కడికి ఎగుమతి అయిన సరకుగా పరిగణిస్తారు. మన ప్రాదేశిక జలాలకు వెలుపల పట్టే మత్స్య సంపదకు ఆర్థిక విలువను భారతీయ మత్స్యకారులు పొందేలా ఈ ఏర్పాటు చేశారు. ఇది దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు ప్రతిపాదించారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేవారికి ‘సుంకాల్లేని దిగుమతుల విలువ’ను ప్రభుత్వం పెంచనుంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో చేసిన ఎగుమతుల్లో ఒక శాతం వరకు ఉన్నదాన్ని ఇప్పుడు 3% చేస్తున్నారు.

మరో 20 వేల మంది పశువైద్యానికి…*

పేద, బలహీనవర్గాలు సహా రైతుల ఆదాయంలో 16% వరకు పశుసంపద ద్వారా వస్తోంది. అందువల్ల మరో 20 వేల మంది పశుసంవర్థక వృత్తి నిపుణులు అందుబాటులోకి వచ్చేలా రుణ ఆధారిత పెట్టుబడి రాయితీ పథకం కొత్తగా అమలు చేస్తారు. ఆ మేరకు వెటర్నరీ కళాశాలలు, పశువైద్య ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, సంతానోత్పత్తి సదుపాయాలు ప్రైవేటు రంగంలో వచ్చేoదుకు పథకం తోడ్పాటు అందిస్తుంది. కొబ్బరి, గంధం, జీడి, బాదం, అక్రోటు, కోకో సాగుపై దృష్టి కేంద్రీకరిస్తారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతారు. పాత, దిగుబడినివ్వని కొబ్బరి చెట్ల స్థానే కొత్తరకం కొబ్బరి మొక్కల్ని నాటే పథకాన్ని చేపడతారు. గంధం చెట్ల పెంపకంలో మునుపటి వైభవాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

. *సొసైటీలకు సహకారం*

పశువుల దాణా, పత్తిగింజల సరఫరాలో ఉన్న సహకార సొసైటీలకు పన్ను రాయితీలు లభించనున్నాయి. ప్రస్తుతం పాలు, నూనెగింజలు, పళ్లు, కూరగాయలు వంటివి సరఫరా చేసే ప్రాథమిక సహకార సొసైటీలకే ఇలాంటి మినహాయింపులు ఉన్నాయి. అంతర్ సహకార సొసైటీ డివిడెండ్ ఆదాయంపై కొత్త ఐటీ చట్టం కిందపన్ను మినహాయింపు లభిస్తుంది. గుర్తింపు పొందిన జాతీయ సహకార సమాఖ్య ఈ ఏడాది జనవరి 31లోగా కంపెనీల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ఉంటుంది. సభ్య సొసైటీలకు ఇచ్చే డివిడెండ్లకు ఇది వర్తిస్తుంది. సహకార సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేదు.

*ఉపాధి హామీకి..*

ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన జీ రామ్ జీకి రూ.95,692 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులను ప్రస్తుత సంవత్సరం కంటే 3.5% పెంచి రూ.1,94,368.81 కోట్లు చేశారు. గ్రామీణ సడక్ యోజనకు ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే రూ.19,000 కోట్లు కేటాయించారు

.l*రాష్ట్రాలతో కలిసి ధన ధాన్య కృషి యోజన*

ఆకాంక్షిత జిల్లాల స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ను చేపట్టనున్నారు. తక్కువ దిగుబడులు వస్తున్న 100 జిల్లాల్లో ఇప్పుడున్న పథకాలను, ప్రత్యేక చర్యల్ని కలిపి దీనిని అమలు చేస్తారు. ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాలు, రుణ పరపతి పెంచడం దీని లక్ష్యం.. దాదాపు 1.7 కోట్ల మందికి ఇది ఉపయోగపడనుంది. వ్యవసాయానికి అండదండలిచ్ౘ్ి, వలసల అవసరం తగ్గేలా చూస్తారు. పప్పు ధాన్యాలకు, ముఖ్యంగా కంది పప్పు, మినపపప్పు, ఎర్ర కందిపప్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆరేళ్ల స్వయంసమృద్ధి సాధించడానికి ‘పప్పుల్లో ఆత్మనిర్భరత’ మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆదాయం పెరగడంతో కూరగాయలు, పండ్లు, శ్రీ-వరి వినియోగం కూడా పెరుగుతోంది. వీటి ఉత్పత్తిని పెంచే సమగ్ర కార్యక్రమం చేపడతారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు, పత్తిరైతుల కోసం ప్రత్యేక మిషన్, 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే స్వల్పకాలిక రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

*500 జలాశయాలు అభివృద్ధి*

దేశీయంగా మత్స్య పరిశ్రమకు ఊతమివ్వడానికి 500 జలాశయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లను తీర్చిదిద్దుతారు. అంకురాలు, మహిళా గ్రూపులు, చేపలసాగు రైతుల ఉత్పత్తుల సంస్థల ద్వారా విలువ పెంచే గొలుసుకట్టు వ్యవస్థను తీర ప్రాంతాల్లో బలోపేతం చేస్తారు.

*బహుళ భాషల్లో భారత్-విస్తార్*

రైతులకు కావాల్సిన సలహాలను వారి వారి భాషల్లో ఇచ్చే0దుకు వీలుగా ఏఐ ఆధారిత ‘భారత్-విస్తార’ సాధనం అందుబాటులోకి వస్తుంది. ఉత్పాదకత పెంచడానికి, రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.*ప్రకృతి వ్యవసాయానికి* ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయానికి రూ. 155.32 కోట్లు కేటాయించారు.

Read More

పుట్టగొడుగుల పెంపకంపై ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు శిక్షణ

ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పుట్టగొడుగుల సాగుపై నైపుణ్య శిక్షణను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. రాజేంద్రనగర్‌లో జరిగే ఈ శిక్షణ కోసం వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.eeihyd.org, www.pjtau.edu.in వెబ్‌సైట్ల ద్వారా సమాచారం పొందాలన్నారు.

Read More